logo

వ్యాధి నయం కాలేదని ఆత్మహత్య

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మణికుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కోరుకొల్లు గ్రామానికి చెందిన నున్న భోగేశ్వరరావు (52) కొంతకాలంగా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు.

Published : 26 Sep 2022 04:44 IST

కలిదిండి, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మణికుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కోరుకొల్లు గ్రామానికి చెందిన నున్న భోగేశ్వరరావు (52) కొంతకాలంగా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నా ఎంతకీ వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపంతో ఈ నెల 24న శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు తొలుత కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కృష్ణాజిల్లా గుడివాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భోగేశ్వరరావు ఆదివారం మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని