రా రమ్మంటేనే..ప్రగతి!
పర్యాటకులను రా.. రమ్మని ఆహ్వానించే ప్రకృతి సోయగాలు.. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు.. పాపికొండల నడుమ నుంచి గోదావరి పరవళ్లు.. సంగమ ప్రాంతాన మడ అడవులు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. మన్యంలో
అతిథి దేవోభవ అంటే ఆదాయం
నేడు పర్యాటక దినోత్సవం
పాలకొల్లు, భీమవరం పట్టణం, న్యూస్టుడే
పర్యాటకులను రా.. రమ్మని ఆహ్వానించే ప్రకృతి సోయగాలు.. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు.. పాపికొండల నడుమ నుంచి గోదావరి పరవళ్లు.. సంగమ ప్రాంతాన మడ అడవులు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. మన్యంలో సెలయేటి గలగలలు.. అన్నింటినీ మించి గోదారోళ్ల మర్యాదలు.. ఉమ్మడి జిల్లాలకు వచ్చేవారిని మంత్రముగ్ధులను చేస్తుంటాయి. కానీ కొవిడ్ కారణంగా గత మూడేళ్లుగా పర్యాటకం చతికిల పడింది.
ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు గోదావరి జిల్లాలకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. రిసార్టులకు బాగా గిరాకీ ఉంటుంది. ఆన్లైన్లో ముందస్తు బుకింగ్లతో గదులు లభించని పరిస్థితి. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో విపరీతమైన గిరాకీ నెలకొంటుంది. అయితే ఆ దిశగా ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. ఉదాహరణకు పేరుపాలెం బీచ్ను తీసుకుంటే ఒక్క కార్తిక మాసంలోనే 2 లక్షల మంది వస్తుంటారు. రిసార్టులు సరిపోక ప్రైవేటు అతిథి గృహాలను పర్యాటకులు ఆశ్రయిస్తుంటారు.చించినాడ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి.
వసతుల లేమితో ఇబ్బందులు.. గుంటుపల్లి గుహలు చూడాలనే ఆకాంక్ష ఉన్నా అక్కడ కనీసం తాగునీరు లభించని పరిస్థితి. ఆచంట మండలం పెదమల్లంలో రూ.2 కోట్లతో నిర్మించిన రిసార్టులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం లేక నిరుపయోగంగా ఉంటున్నాయి.
అడుగులు పడితేనే
మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో గతంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. భీమవరం పట్టణ పరిధిలో పర్యాటక అభివృద్ధి నిమిత్తం కొన్నేళ్ల కిందట రూ. 25లక్షలు కేటాయించారు. దాదాపు రూ.10 లక్షలతో గునుపూడిలో పంచారామక్షేత్రం పక్కన సమాచార కేంద్రం, వసతిగృహాలను మాత్రం నిర్మించారు.. * పెండింగ్లో ఉన్న పెదమల్లం, పేరుపాలెం రిసార్టుల పనులు పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని పర్యాటకాభివృద్ధి అధికారి మెహర్హఫీజ్ అన్నారు. కొల్లేరులో టూరిస్టు హబ్ ఏర్పాటుకు రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు
సందర్శన ప్రాంతాలు
పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, ద్వారకాతిరుమల, ఎర్రకాలువ జలాశయం, గుంటుపల్లిగుహలు, గుబ్బల మంగమ్మ ఆలయం, పారిజాతగిరి, కొల్లేరు సరస్సు, పేరుపాలెం బీచ్, పెదమల్లం రిసార్ట్స్, యలమంచిలిలంక, చించినాడ, నరసాపురం గోదావరి తీర ప్రాంతాలు.
ప్రతిపాదనలు సిద్ధం
పేరుపాలెం బీచ్ను అభివృద్ధి చేసేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని పర్యాటకశాఖ జిల్లా మేనేజరు పట్టాభిరామన్న చెప్పారు.పర్యాటకుల కోసం వసతులు సమకూరుస్తామన్నారు. పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ పరిధిలో సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణానికి రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపించామన్నారు.
పర్యాటకం ద్వారా ఉమ్మడి జిల్లాల ఆదాయం రూ.3 కోట్లు
ఏటా వచ్చే పర్యాటకులు 3.5 లక్షలు
ఒక విదేశీ యాత్రికుడు వస్తే రోజుకు వెచ్చించే మొత్తం రూ.1.50 లక్షలు
కొల్లేరులో టూరిజం హబ్కు ప్రతిపాదనలు రూ.8 కోట్లు
పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తే ఏటా ఉపాధి పొందేవారు 20 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే