లిఫ్ట్ అడిగి.. మధ్యలో దాడి చేసి!
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటనపై కైకలూరు గ్రామీణ ఠాణాలో ఆలస్యంగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన రామవరానికి చెందిన యాళ్ల వికాస్బాబు(23) ఇంటర్ వరకు చదివి చేపల
చికిత్స పొందుతూ యువకుని మృతి
ఘటనపై అనుమానాలు
కైకలూరు గ్రామీణం, న్యూస్టుడే
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటనపై కైకలూరు గ్రామీణ ఠాణాలో ఆలస్యంగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన రామవరానికి చెందిన యాళ్ల వికాస్బాబు(23) ఇంటర్ వరకు చదివి చేపల ప్యాకింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 16న రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చేపల ప్యాకింగ్కు పల్లెవాడ నుంచి ఆలపాడు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. అతనిని వాహనంపై ఎక్కించుకుని వెళ్తుండగా పల్లెవాడ పెట్రోల్ బంకు సమీపంలో వెనుక కూర్చున్న వ్యక్తి ముసుగు వేశాడు. అప్పటికే మాటు వేసిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వికాస్పై దాడి చేసి తాళ్లతో కట్టి రోడ్డు పక్కనే పడేశారు. అతని ద్విచక్రవాహనంతోపాటు చరవాణిని తీసుకెళ్లిపోయారు. మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో వాకింగ్కు వెళ్తున్న వ్యక్తి చూసి అతని కట్లు విప్పారు. కుటుంబ సభ్యులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు. బాధితుడిని ఇంటికి తీసుకెళ్లి అతని ఫోన్కు రింగ్ చేయగా ఆలపాడుకు చెందిన తోట శివకుమార్ ఫోన్ లిఫ్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్, బట్టలు, ద్విచక్రవాహనం తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న వికాస్ ఆర్యోగ పరిస్థితి బాగోకపోవడంతో అతని తండ్రి భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చెందాడు. వికాస్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు సోమవారం ఎస్సై చల్లాకృష్ణ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే...
యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి ఘటనపై ఈనెల 17న రూరల్ పోలీస్స్టేషన్లో వికాస్ ఫిర్యాదు చేశారు. అందుకు కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు తీసుకొచ్చి నామమాత్రపు విచారణ చేసి పంపించేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడికి పైకి తెలియని బలమైన గాయాలు కావడంతో ఇంటికెళ్లాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకివీడు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం భీమవరం తీసుకెళ్లారు. కొందరు పెద్దల సమక్షంలో కేసును రాజీ చేశారని తెలిసింది. వికాస్ చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM