నిబంధనలు గాలికి..
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి చేపలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ప్రసుత్తం ఇతర రాష్ట్రాలు కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పోటీ ఎదురవుతోంది. పేరుకు డెల్టా ప్రాంతమైనా కీలక సమయంలో నీటి లభ్యత లేకపోవడం, కలుషిత నీటితో ఆ పోటీని తట్టుకోవడంలో మన ఆక్వా రైతులు చతికిలపడుతున్నారు.
చేపల సాగుకు కలుషిత నీటి బెడద
దిగుబడిపై ప్రతికూల ప్రభావం
మోటూరు ఛానల్లోకి వదులుతున్న ఉప్పునీరు
మండవల్లి, న్యూస్టుడే: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి చేపలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ప్రసుత్తం ఇతర రాష్ట్రాలు కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పోటీ ఎదురవుతోంది. పేరుకు డెల్టా ప్రాంతమైనా కీలక సమయంలో నీటి లభ్యత లేకపోవడం, కలుషిత నీటితో ఆ పోటీని తట్టుకోవడంలో మన ఆక్వా రైతులు చతికిలపడుతున్నారు.
ఏలూరు జిల్లా పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఏటా 8 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధానంగా మంచినీటి లభ్యతపైనే చేపల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఆరు నెలలకోసారి సమృద్ధిగా మంచినీరు లభిస్తేనే చేపల్లో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బెడద తగ్గుతుంది. ఫలితంగా పెట్టుబడుల భారం తగ్గి రైతులు మంచి లాభాలు సాధించేందుకు వీలుంటుంది. అయితే చెరువుల నిర్వహణలో నిబంధనలు పాటించక పోవడంతో కాలువల్లోని నీరు కలుషితమవుతున్నాయి. తిరిగి ఆ నీటినే చెరువుల్లో నింపుతుండటంతో దిగుబడి పడిపోయి నష్టాలు తప్పడం లేదు.
స్వయంకృత అపరాధమే.. నిబంధనల ప్రకారం ఆక్వా చెరువు తవ్వాలంటే తప్పక డ్రెయినేజీ సౌకర్యం ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని 90 శాతం చెరువులకు ఈ సౌకర్యం లేకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారు. చెరువుల్లో కలుషితమైన మురుగునీటిని నేరుగా మంచినీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో నీలి ఆకు, పచ్చశైవలం వంటివి పెరిగి నీరు కలుషితమవుతోంది. మరోవైపు వనామీ రొయ్యల సాగులో వినియోగించిన ఉప్పునీటిని నేరుగా కాలువల్లోకి విడుదల చేస్తున్నారు.
చైతన్యం అవసరం.. ఒకప్పుడు దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ చేపల రంగం ఉండేది. ఇక్కడి నుంచి 16 రాష్ట్రాలకు కేవలం మన చేపలనే ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం తెలంగాణ, ఒడిశా, పశ్చిమబంగ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చేపలసాగు దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పోటీని ఎదుర్కోవాలంటే నాణ్యమైన నీటి వనరులే ఆధారం.
చేపల సాగుకు నీటిని ఇవ్వాలి
సాగునీటితోపాటు చేపల చెరువులకు సైతం నీటిని విడుదల చేయాలి. మంచినీటి కాలువల్లోకి ఉప్పునీటిని విడుదల చేస్తున్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. మోటూరు, గుడివాడ ఛానళ్లు వర్షకాలంలో సైతం ఉప్పునీటితోనే ఉంటున్నాయి. - సీహెచ్. శ్రీమన్నారాయణ, చేపల రైతు, భైరవపట్నం
కేసులు పెడుతున్నాం
పంటకాలువల్లో ఉప్పునీటిని విడుదల చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నాం. అన్ని గ్రామాల్లో మంచినీటి వనరులను కలుషితం చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉప్పునీటి వల్ల చేపల పెరుగుదల నిలిచిపోయి, వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. - ప్రతిభ, ఏడీఏ మత్స్యశాఖ, కైకలూరు
ఉమ్మడి జిల్లాలో చేపల సాగు ఇలా..
ఏలూరు లక్ష ఎకరాలు
పశ్చిమగోదావరి 30 వేల ఎకరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య