జననాల నమోదులో నిర్లక్ష్యం
పుట్టిన ప్రతి పసిబిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కీలకం. అంగన్వాడీ సేవల నుంచి ఆధార్ నమోదు వరకు అన్నింటికీ అదే ఆధారం. అయితే ఆ పుట్టిన రోజును నమోదు చేయడంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: పుట్టిన ప్రతి పసిబిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కీలకం. అంగన్వాడీ సేవల నుంచి ఆధార్ నమోదు వరకు అన్నింటికీ అదే ఆధారం. అయితే ఆ పుట్టిన రోజును నమోదు చేయడంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా జనన ధ్రువీకరణ పత్రం జారీ కాకపోవడం.. ఆధార్ లేనందున తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు జంగారెడ్డిగూడెంలో ఎక్కువమంది ఉన్నారు. ఆసుపత్రుల వారు వివరాలను ఆన్లైన్ చేయలేదన్న విషయం తెలియక పురపాలక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాధారణంగా పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేయాలి. ఏడాదిలోపు నోటరీ ద్వారా అవకాశం ఉంది. దాటితే పురపాలక కార్యాలయంలో నమోదు కాలేదన్న పత్రం తీసుకోవాలి. అనంతరం తహశీల్దారు, ఆర్డీవో విచారించి ధ్రువీకరించాకే నమోదుకు అవకాశం ఉంటుంది.
చాలా రోజుల నుంచి తిరుగుతున్నా
‘2020 మే 23న నాకు బాబు సాత్విక్ పుట్టాడు. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స చేశారు. జనన వివరాలు పురపాలక కార్యాలయంలో నమోదు కాలేదు. అప్పటి నుంచి ఆసుపత్రి, పురపాలక కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఆసుపత్రిలో ప్రసవం జరిగితే ఇంటి దగ్గర ప్రసవించినట్లు ధ్రువపత్రం తీసుకోమని అక్కడివారు సలహా ఇస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో అదే ఆసుపత్రిలో పాప పుట్టింది. ఆమెకు జనన ధ్రువీకరణ వచ్చింది. ఆధార్ రాక ఇబ్బందులు పడుతున్నాం’ అని సీహెచ్పోతేపల్లికి చెందిన గౌతమి తెలిపారు.
మనవరాలికి ఆధార్ రాలేదు
‘మా అమ్మాయి కొండా అనూష జనవరి 11న ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించింది. ధ్రువపత్రం కోసం పురపాలక కార్యాలయానికి వెళ్తే ఆన్లైన్ కాలేదన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు తిరిగినా ఫలితం లేదు. ఆసుపత్రి వారు మా అమ్మాయి ప్రసవమైనట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తప్పు ఎవరిదో తెలియడం లేదు. ఈ కారణంగా మా మనవరాలికి ఆధార్ రాలేదు’ అని మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన కలిబోయిన శ్రీను, నాగలక్ష్మి తెలిపారు.
ఎవరిని అడగాలో తెలియడం లేదు
‘పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాకు 2020 మార్చి 15న బాబు పుట్టాడు. మా అబ్బాయి పేరు నమోదు కాలేదని చెబుతున్నారు. ఫలితంగా ఆధార్ రాక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియడం లేదు’ అని రావికంపాడుకు చెందిన చింతా కల్యాణి వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి