అడుగడుగునా అవరోధాలు
ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థకు వివిధ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండాడ, మొగదిండి, రుద్రాయకోడు, చినకాపవరం, యండగండి తదితర ప్రధాన డ్రెయిన్ల గట్లు వివిధ చోట్ల జారిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి.
ఎగువ నుంచి కొట్టుకొస్తున్న తూడు, గుర్రపుడెక్క
వంతెనలకు దిగువున మేట వేస్తున్న వ్యర్థాలు
ఉండి, న్యూస్టుడే
ఉండి - ఆకివీడుల మధ్య 165వ జాతీయ రహదారిపై అజ్జమూరు వంతెన ఇది. దీని దిగువున మట్టి, చెత్తాచెదారం చాలాకాలం నుంచి పేరుకుపోయింది. దీంతో ఎగువనున్న ఉండి మండలంలోని కవిటంపాకలు, అర్తమూరు, ఆకివీడు మండలంలోని అజ్జమూరు తదితర ప్రాంతాల్లో వరి, ఆక్వా చెరువుల్లోని మురుగునీరు సకాలంలో ముందుకెళ్లడం లేదని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.
ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థకు వివిధ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండాడ, మొగదిండి, రుద్రాయకోడు, చినకాపవరం, యండగండి తదితర ప్రధాన డ్రెయిన్ల గట్లు వివిధ చోట్ల జారిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. మురుగు ముందుకెళ్లని పరిస్థితి. బొండాడ, రుద్రాయకోడు, చినకాపవరం, మొగదిండి తదితర డ్రెయిన్ల పరిధిలో పెరిగిపోతున్న ఆక్రమణలే ఇందుకు కారణం. ప్రధానంగా మూడు మీటర్లు వదిలిన తర్వాతే ఆక్వా చెరువులు తవ్వుకోవాలనే నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. ఆయా డ్రెయిన్ల వెంబడి కనీసం కాలిబాట మార్గాలు కూడా కరవైపోతున్నాయి. పూడికతీత పనులు చేపట్టాలంటే కనీసం పొక్లెయిన్ కూడా డ్రెయిన్ గట్లపై ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
సకాలంలో గుత్తేదారులు ముందుకు రాక.. రుద్రాయకోడు, చినకాపవరం, మొగదిండి వంటి డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులకు గుత్తేదారులు సకాలంలో ముందుకురాని పరిస్థితి ఈ ఏడాది ఎదురైంది. దీంతో ఖరీఫ్ నారుమడి దశలోనే ఆయా డ్రెయిన్ల పరిధిలోని వరి రైతులు అధికవర్షాల సమయాల్లో ముంపు సమస్యను చవిచూశారు. డ్రెయిన్ల అధ్వానపరిస్థితిపై ‘ఈనాడు’లో జులై, ఆగస్టు నెలల్లో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి గుత్తేదారులను ఒప్పించి తూడు తొలగింపు పనులు చేపట్టారు. పైన తీస్తున్న గుర్రపుడెక్కను వివిధ చోట్ల కిందకు నెట్టేస్తుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
అన్ని చోట్లా తూడు తొలగింపు పనులు
మురుగునీటి పారుదలకు అవరోధాలు ఎదురవకుండా తూడు తొలగింపు పనులు చేపట్టాం. వంతెనలు, కల్వర్టు వద్ద చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పూడికతీత పనుల ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - టి.అప్పారావు, డీఈఈ, డ్రైనేజీ శాఖ, ఆకివీడు.
ఈ చిత్రం ఉండి మండలంలోని వాండ్రం కాజ్వే ప్రాంతంలోనిది. బొండాడ మేజర్ డ్రెయిన్లో మురుగునీటి పారుదలకు ఇక్కడ తూడు, గుర్రపుడెక్కలు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. అధిక వర్షాలు కురిసిన సమయాల్లో పల్లపు ప్రాంతాల్లోని వరి చేల్లో మురుగు ముందుకెళ్లక రైతులు ఇబ్బందులు చవిచూస్తున్నారు.
అజ్జమూరు వంతెన వద్ద మురుగునీటిని అడ్డుకుంటున్న మట్టి గుట్టలివి. ఉండి ప్రధాన పంట కాలువలకు టైలాండ్గా ఉన్న రుద్రాయకోడులోని నీరంతా ఇక్కడి నుంచే ఆకివీడు, కాళ్ల మండలాల మీదుగా ఉప్పుటేరులోకి చేరాల్సి ఉంది. మట్టిగుట్టల కారణంగా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మ చనిపోయారు.. పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు