logo

వేంకన్న సన్నిధిలో విరామం

రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.. అది అమరావతే కావాలి అంటూ మహాపాదయాత్ర సాగిస్తున్న రైతులు శనివారం ద్వారకాతిరుమలలో చినవేంకన్నకు పూజలు చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన యాత్రతో అలసిన కాళ్లకు.. నినదించిన గొంతులకు విరామం ఇచ్చి సేద తీరారు.

Published : 02 Oct 2022 03:00 IST

స్వామి దర్శనం చేసుకున్న పాదయాత్ర రైతులు

నేడు ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో..

ఆలయ మెట్లపై నినాదాలు చేస్తున్న అమరావతి రైతులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, ద్వారకా తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.. అది అమరావతే కావాలి అంటూ మహాపాదయాత్ర సాగిస్తున్న రైతులు శనివారం ద్వారకాతిరుమలలో చినవేంకన్నకు పూజలు చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన యాత్రతో అలసిన కాళ్లకు.. నినదించిన గొంతులకు విరామం ఇచ్చి సేద తీరారు. ఆదివారం పునఃప్రారంభం కానున్న యాత్రకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల నుంచి సొంతూళ్లు, కుటుంబ సభ్యులను దూరంగా ఉన్న రైతులు సెలవు దొరకడంతో వారికి ఫోన్లు చేసి పలకరించారు. నడకతో కాళ్లకు వాపులు, బొబ్బలు రావడంతో లేపనాలు రాసుకున్నారు. వీరిని నిరంతరం వైద్యులు పరీక్షిస్తున్నారు. మహాపాదయాత్ర 21వ రోజు ఆదివారం ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో సాగనుంది.


పరీక్ష చేస్తున్న వైద్యురాలు


కాళ్లకు లేపనం రాసుకుంటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని