దారికి రాని పనులు
ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి విస్తరణకు ఇరువైపులా తవ్వి వదిలేశారు. పలు చోట్ల కల్వర్టులు నిర్మించారు. శ్రీపర్రు వద్ద వంతెన నిర్మాణం పునాదుల్లో నిలిచింది. శ్రీపర్రు- కలకుర్రు మధ్యలో మార్జిన్లు తవ్వి వదిలేయడంతో రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
నిలిచిన ఎన్డీబీ మార్గాలు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే
వంగాయగూడెం నుంచి పెరికీడు రోడ్డులో కల్వర్టులు మాత్రమే నిర్మించారు. వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ఈ రహదారి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి విస్తరణకు ఇరువైపులా తవ్వి వదిలేశారు. పలు చోట్ల కల్వర్టులు నిర్మించారు. శ్రీపర్రు వద్ద వంతెన నిర్మాణం పునాదుల్లో నిలిచింది. శ్రీపర్రు- కలకుర్రు మధ్యలో మార్జిన్లు తవ్వి వదిలేయడంతో రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు పక్కకు తొలగేందుకు వీలు లేక కిలోమీటర్ల మేర బారులు తీరి ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది.
ఉమ్మడి జిల్లాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మొత్తం 74 కిలోమీటర్ల మేర 11 రహదారులను రెండు వరుసలతో విస్తరించాలని రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది. రూ.201 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను ఒకే ప్యాకేజీగా గతేడాది మేలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ దక్కించుకుంది. రెండేళ్లలో పూర్తిచేయాలని అధికారులు గడువు విధించారు. అయితే ఇప్పటివరకు 13 శాతం పనులే జరిగాయి. రహదారుల విస్తరణలో భాగంగా కల్వర్టులు, రక్షణ గోడల నిర్మాణం వంటి రూ.15 కోట్లు విలువ చేసే పనులు చేశారు. పనులకు సంబంధించిన బిల్లులను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గుత్తేదారుకు సొమ్ములు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపివేశారు. మిగతావి ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్దేశిత సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
నిధుల లేమితో రహదారులను అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల నిర్మాణానికి బ్యాంకులు రుణమిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
గడువులోగా పనుల పూర్తికి చర్యలు
- జి.వి. భాస్కరరావు, పర్యవేక్షక ఇంజినీర్, రహదారులు భవనాల శాఖ
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం. గుత్తేదారు చేసిన పనులకు సంబంధించి బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. మంజూరు కావాల్సి ఉంది. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో పనులకు ఆటంకంగా మారింది. వర్షాలు తగ్గగానే పనులను వేగవంతం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో