logo

చంద్రబాబు పర్యటనకు తరలిరండి: తెదేపా

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ నెల 30న చింతలపూడి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు పిలుపునిచ్చారు.

Published : 26 Nov 2022 06:14 IST

జంగారెడ్డిగూడెంలో మాట్లాడుతున్న రామ్మోహనరావు, బాబు, గన్ని

చింతలపూడి, జంగారెడ్డిగూడెం గ్రామీణ,  న్యూస్‌టుడే: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ నెల 30న చింతలపూడి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటిన చల్లావారిగూడెంలో పోలవరం భూ నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పారు. చింతలపూడిలో చంద్రబాబు రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని