logo

పాత కక్షలతో యువకుడి హత్య

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో శనివారం సాయంత్రం ఓ యువకుడి హత్య జరిగింది.

Published : 26 Nov 2022 19:35 IST

కామవరపుకోట: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో శనివారం సాయంత్రం ఓ యువకుడి హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి సిద్ధార్థ(17)ను అదే గ్రామానికి చెందిన బి.నాగరాజు కత్తితో నరికి హత్య చేశాడు. పక్కపక్క ఇళ్లలో ఉండే వీరిద్దరికి నెల రోజుల క్రితం వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో శనివారం సాయంత్రం మద్యం సేవించిన నాగరాజు కళాశాల నుంచి వస్తున్న సిద్ధార్థను రోడ్డుపై అడ్డగించి కత్తితో మెడపై నరికాడు. దీంతో సిద్దార్థ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికెలపూడి ఎస్సై వెంకన్న పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని