రైలు ఢీకొని ఇద్దరి మృతి
గుర్తు తెలియని రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
తణుకు, న్యూస్టుడే: గుర్తు తెలియని రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. తణుకు ఆర్వోబీ కింద రైలు పట్టాలపై ఇద్దరు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి ఎస్సై జి.శ్రీహరిబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల్లో ఒకరికి సుమారు 46 ఏళ్లు, మరొకరికి 40 ఏళ్ల వయసు ఉంటుంది. మృతదేహాలను తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో భద్రపర్చారు. వివరాలకు 9573891737 నంబర్ను సంప్రదించాలని ఎస్సై కోరారు. సీసాలు, అట్టలు ఏరుకునేవారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Online Betting: రూ.కోటి గెల్చుకున్న ఆనందం.. మద్యం తాగి వికృత చేష్టలు
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!