logo

విభజన హామీలు తక్షణమే అమలు చేయాలి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ఏలూరులోని పాతబస్టాండు కూడలి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Published : 27 Nov 2022 04:11 IST

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ఏలూరులోని పాతబస్టాండు కూడలి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా కో కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రాష్ట్రం హక్కులను సాధించడంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీపీఐ, ఇతర వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కిషోర్‌, హేమశంకర్‌, కన్నబాబు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని