సాగిపాడులో ఇంటర్ విద్యార్థి హత్య
పాత గొడవల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిపై యువకుడు కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కామవరపుకోట మండలం సాగిపాడులో చోటుచేసుకుంది.
పాత గొడవల నేపథ్యంలో కత్తితో దాడి
సిద్ధార్థ (పాత చిత్రం)
సాగిపాడు (కామవరపుకోట), న్యూస్టుడే: పాత గొడవల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిపై యువకుడు కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కామవరపుకోట మండలం సాగిపాడులో చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సిద్దార్థ(18) ఇంటర్ చదువుతున్నాడు. ఇతడికి, అదే ఊరికి చెందిన బి.నాగరాజుకు మధ్య నెలరోజుల కిందట ఓ విషయమై వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏలూరులోని కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన సిద్ధార్థ.. గ్రామంలోని ప్రధాన బజారులో నడుచుకుంటూ వస్తుండగా మద్యం తాగి ఉన్న నాగరాజు కత్తితో తొలుత తలపై, అనంతరం మెడపై దాడి చేశాడు. సిద్ధార్థ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఉదంతంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై కె.వెంకన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?