బడిలో కలకలం
కొత్త ఆహార పట్టిక ప్రకారం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన తీపి పొంగలి, పుదీనా రైస్, పప్పుచారు అన్నం తిన్న 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన పాలకోడేరులోని నెం.1 ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది.
మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత
ఆసుపత్రి వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామరాజు
పాలకోడేరు, భీమవరం పట్టణం, న్యూస్టుడే: కొత్త ఆహార పట్టిక ప్రకారం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన తీపి పొంగలి, పుదీనా రైస్, పప్పుచారు అన్నం తిన్న 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన పాలకోడేరులోని నెం.1 ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన నలుగురు విద్యార్థులు వాంతులు వస్తున్నట్టు, కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై నలతగా ఉన్న 21 మంది చిన్నారులను స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. ఇంతలోనే జ్వరంతో బాధపడుతున్న 4వ తరగతి విద్యార్థి చింతా ఆదాం వాంతులు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. వైద్యుడు సీహెచ్వీఎస్ రంగంనాయుడు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వైద్యసేవలు అందించారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన పుదీనా రైస్ రుచి, వాసన పడకపోవడమే దీనికి కారణమని, సాధారణ చికిత్స అనంతరం అంతా కోలుకున్నారని వైద్యుడు చెప్పారు. చికిత్స అనంతరం విద్యార్థులందరినీ వారి ఇళ్లకు పంపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.చిట్టిబాబు తెలిపారు. డీఈవో ఆర్.వెంకటరమణ, అధికారులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లి చిన్నారులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
కూచింపూడిలో..
పెదవేగి, న్యూస్టుడే: పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 482 మంది చదువుతుండగా శనివారం 389 మంది మధ్యాహ్న భోజనం చేశారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రామానుజం చిన్నారి, పెద్దిశెట్టి దుర్గారాణి, తుక్కులూరి దుర్గ, కొల్లిపాము సంధ్యలకు వాంతులయ్యాయి. 11 మందికి కడుపునొప్పి రావడంతో వారిని ఉపాధ్యాయులు పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత మంది విద్యార్థులు భోజనం చేస్తే.. ఒకే తరగతికి చెందిన 15 మందికి ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. వేగివాడ ప్రాథమిక పాఠశాలలో గతనెల 20న మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇద్దరికి అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. ఆ ఘటనను మరువక ముందే శనివారం కూచింపూడిలో ఇలా జరగడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హుటాహుటిన పీహెచ్సీకి చేరుకొని చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి