అనుమతులు లేకుండానే వైద్యం!
జిల్లాలోని పట్టణాల్లో కొంత మంది అర్హత లేకుండా వైద్యం చేసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1200 ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లున్నాయి.
తణుకు, న్యూస్టుడే
* తణుకు ఎస్.శోభన్బాబుగారి వీధిలో నిర్వహిస్తున్న సన్ ఆసుపత్రిని వైద్యాధికారులు తనిఖీ చేసి ఇటీవల సీజ్ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు, వైద్యుని డిగ్రీ తదితర అంశాలపై కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో అసలు విషయం బయటపడింది.
* తణుకులో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యం చేస్తూ క్లినిక్ను నిర్వహిస్తున్న వైద్యుడు శ్రీకాంత్పై కేసు నమోదు చేశారు.
* తణుకు శ్రీకర ఆసుపత్రిని విజిలెన్స్ అధికారులు ఇటీవల పరిశీలించి ధ్రువపత్రాలు సరిగా లేకపోవడంతో పాటు రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని సీజ్ చేశారు.
* తాడేపల్లిగూడెంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఆసుపత్రిని మూసివేశారు.
ఆసుపత్రిలో అధికారుల తనిఖీ (పాత చిత్రం)
జిల్లాలోని పట్టణాల్లో కొంత మంది అర్హత లేకుండా వైద్యం చేసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1200 ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లున్నాయి. ఏలూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, భీమవరం, తాడేపల్లిగూడెంలలో కొన్ని ప్రైవేటు వైద్యశాలలకు అనుమతులు లేవు. రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్ దేశాల్లో ఎండీ వైద్య విద్య పూర్తి చేసిన పలువురు ఇక్కడ ఎండీగా చలామణి అవుతున్నారు. అక్కడ ఎండీ చేసినా ఇక్కడ ఎంబీబీఎస్గానే పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు ఇవే..
* ఆసుపత్రికి సంబంధించిన వైద్యుడి కలర్ ఫొటో, మెడికల్ కౌన్సిల్ ధ్రువపత్రాన్ని ప్రదర్శించాలి.
* పర్యావరణ నిబంధనలు (ఈవీబీ), ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారనేది కార్మిక శాఖ నుంచి పొందిన రిజిస్ట్రేషన్ పత్రం ఉండాలి.
* శస్త్ర చికిత్స థియేటర్లలో వాడే మత్తు మందుల వివరాలు రిజిస్టర్లో పొందుపర్చాలి.
* ఓపీతో పాటు శస్త్ర చికిత్సకు సంబంధించి దేనికి ఎంత రుసుము వసూలు చేస్తున్నారనేది పట్టిక రూపంలో బహిరంగంగా ప్రదర్శించాలి.
నిఘా పెంచడంతో.. ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయించకుండా ఆసుపత్రుల నిర్వహణ చేపట్టడంతో అధికారులు నిఘా పెంచారు. ప్రతి ఆసుపత్రికి వెళ్లి అనుమతులు, ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక బృందంతో సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని సుమారు 12 ఆసుపత్రుల నిర్వాహకులు పర్యావరణ, ప్రజారోగ్య శాఖలకు దరఖాస్తులు చేసుకున్నారంటే నిబంధనలు ఏ మేర పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘రిజిస్ట్రేషన్ చేయించుకోని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నాం. రోగుల నుంచి అధికంగా వసూళ్ల్లు చేస్తే చర్యలు తప్పవు. ఈ నెల 10న భీమవరంలోని రెండు ల్యాబుల్లో తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చాం’ అని డీఎంహెచ్వో మహేశ్వరరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...