సమన్వయ లోపం
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోంది. రైసుమిల్లుల వద్ద పరిస్థితిని ఆర్బీకే సిబ్బందికి వివరించడంలో నిర్లక్ష్యం ఫలితంగా రైతుకు రవాణా భారం పెరుగుతోంది.
దిగుమతి కాని ధాన్యం
రైతులపై అదనపు భారం
పెనుమంట్ర, న్యూస్టుడే: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోంది. రైసుమిల్లుల వద్ద పరిస్థితిని ఆర్బీకే సిబ్బందికి వివరించడంలో నిర్లక్ష్యం ఫలితంగా రైతుకు రవాణా భారం పెరుగుతోంది. ఆదివారం పెనుమంట్ర మండలంలోని 19 ఆర్బీకేల పరిధిలో 199.76 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో కొంత మేర ధాన్యం పాలకొల్లు పరిసర ప్రాంతాల రైసు మిల్లులకు ఎగుమతి చేశారు. ఆయా రైసుమిల్లుల్లో ఉదయం దిగుమతి చేసిన జట్టు కార్మికులు మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. ఫలితంగా మధ్యాహ్నం నుంచి వెళ్లిన ధాన్యం తీసుకెళ్లిన వారికి దిగుమతికి అవకాశం లేక వాహనాల్లోనే ఉండిపోయింది. జుత్తిగ, మార్టేరు ఆర్బీకేల నుంచి రెండు వాహనాల్లో వెళ్లిన 483 బస్తాల ధాన్యం దిగుమతి కానందున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం దిగుమతి చేసే అవకాశం ఉండటంతో వాహన ఛార్జి, చోదకుడి వేతనం వంటివి తమపై అదనపు భారం పడుతుందని రైతులు చెబుతున్నారు.
భయపెడుతున్న వాతావరణం.. తరచూ మారుతున్న వాతావరణ పరిస్థితులతో వర్షం పడి ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మంచు ప్రభావం తేమ శాతంపై పడుతుందని భయపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇస్తే ధాన్యం ఎగుమతి చేసేవారమే కాదన్నారు. ఇతర ఆర్బీకేల నుచీ ఆయా రైసు మిల్లులకు ధాన్యం ఎగుమతి అయినట్లు సమాచారం. ఆయా మిల్లుల వద్ద ఉండే రెవెన్యూ సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ యంత్రాంగానికి సమాచారం అందించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. మండల స్థాయి అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!