సస్పెన్షన్లంటే లెక్కే లేదు!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇందుకు ఉదాహరణ.
కొందరు సబ్రిజిస్ట్రార్ల తీరిది
మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
భీమవరం అర్బన్, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇందుకు ఉదాహరణ. సాక్షాత్తు సబ్ కలెక్టర్ నిర్వహించిన తనిఖీల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడగా.. అక్కడి సబ్రిజిస్ట్రార్ అంగీకరించడం సంచలనంగా మారింది. ఇలాంటి అక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయనే విషయమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. నిషిద్ధ భూములను రిజిస్ట్రేషన్ చేయడం, కార్యాలయాల్లో రికార్డులు తారుమారు చేయడం, నకిలీ చలానాల వ్యవహారం.. ఇలా చెబుతూ పోతే జిల్లాలో ఆ శాఖ లీలలకు లెక్కే లేదు. గత ఏడాది కాలంలో నలుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ కావడమే ఇందుకు నిదర్శనం. అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడిన సందర్భాల్లో బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతో తమ పని పూర్తయిందన్నట్లుగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సస్పెండైన వారు కొంతకాలం తర్వాత ఏదో ఒక విధంగా ఎక్కడో ఒకచోట విధుల్లో చేరిపోతున్నారు. మళ్లీ అటువంటి పనులకు పాల్పడుతున్నారు. మూలాలపై దృష్టి సారించకపోవడం, కఠినచర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ దాడులు, తనిఖీలు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో శాఖాపరంగా ఎక్కడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని కేసులు దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతున్నాయి. కొంతకాలానికి అందరూ ఆ విషయాలను మర్చిపోతున్నారు.
కొన్ని ముఖ్య ఘటనలు ఇవీ
* నిషిద్ధ జాబితాలో ఉన్న కుమ్మరపురుగుపాలెంలోని ఒక అసైన్డ్ భూమికి సంబంధించి 16 దస్త్రాలను గతంలో రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో అప్పటి మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు పడింది.
* నరసాపురం ప్రాంతంలో నిషిద్ధ భూమి వ్యవహారంలో కోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులున్నా రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు.
* ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద విలువైన భూమిని భీమవరం కార్యాలయంలో అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ ఘటనలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.
* ఆచంట ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్గా పని చేసిన మహిళా అధికారిణి నిబంధనలకు విరుద్ధంగా భీమవరం ప్రాంతానికి చెందిన భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అప్పట్లో సస్పెండ్ అయ్యారు.
* కొవ్వూరులో 2.6 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో మార్కెట్ విలువను రూ.4.78 కోట్లకు గాను రూ.1.25 కోట్లకు తగ్గించిన వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అప్పటి సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన మహిళా అధికారిణి సస్పెండ్ అయ్యారు. ఆ సమయానికి ఆమె వేరేచోట పని చేస్తున్నారు.
నిబంధనలకు లోబడి పని చేయాలి
- సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం
ఎవరైనా నిబంధనలకు లోబడి పని చేయాల్సిందే. వాటిని అతిక్రమించినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శాఖాపరంగా తనిఖీలు చేసి నివేదిక రూపొందించాం. దాన్ని డీఐజీకి పంపిస్తున్నాం. ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.