చాపకింద నీరులా!
ఏలూరు జిల్లాలో 13.80 లక్షల పశు సంపద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులు పశువులపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పశువైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు..
పశువుల్లో వెలుగుచూస్తున్న ముద్దచర్మ వ్యాధి లక్షణాలు
ఆందోళనలో పెంపకందారులు
ఆవుకు సోకిన వ్యాధి
* ఏలూరు గ్రామీణ మండలం చొదిమెళ్ల గ్రామంలో ఉన్నట్టుండి పశువులకు జ్వరం సోకడం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చర్మంపై బొబ్బలు తదితర లక్షణాలతో నీరసించిపోయి సరిగ్గా నడవలేకపోతున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేలోపే గ్రామంలో నాలుగు పశువులు చనిపోయాయి. మరో రెండు ఆవుల పరిస్థితి విషమంగా మారింది. వాటికి ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్) లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
* ముదినేపల్లి మండలం గురజలో కొద్ది రోజుల కిందట పది ఆవుల్లో ముద్దచర్మ వ్యాధి లక్షణాలు కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: ఏలూరు జిల్లాలో 13.80 లక్షల పశు సంపద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులు పశువులపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పశువైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు.. ముద్దచర్మ వ్యాధి గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు. దీనిపై పశు పోషకులకు సరైన అవగాహన లేదు. ఎక్కడైనా ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే అప్పుటికప్పుడు తూతూమంత్రంగా అవగాహన చర్యలు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కీటకాల ద్వారా..
ముద్దచర్మ వ్యాధి కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది సోకిన పశువుల్లో గంటల వ్యవధిలోనే జ్వరం, చర్మం అంతటా బొబ్బలు ఏర్పడి మరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇది పాల ఉత్పత్తి సామర్థ్యాన్నీ దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఈ లక్షణాలున్న పశువులను కనీసం 15 రోజులు వేరుగా ఉంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటున్నారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-డాక్టర్ నెహ్రూబాబు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు
ఏలూరు గ్రామీణ మండలంలో కొన్ని పశువుల్లో ముద్దచర్మ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమయ్యాం. అనుమానిత పశువుల నమూనాలను సేకరించి నిర్ధరణ కోసం భోపాల్ పంపిస్తున్నాం. జిల్లాలో లక్షకు పైగా వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాం. పశువుల్లో టీకాలు వేసే ప్రక్రియను మరింత వేగం చేస్తాం. ఈ వ్యాధి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనుషులకు సోకదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?