తీరాన్నీ వదల్లేదు!
మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పేరుపాలెం తీరంలోని భూములు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆక్రమణల్లో భూములు
పేరుపాలెంతీరంలో ఉన్న భూములు
మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పేరుపాలెం తీరంలోని భూములు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సూత్రధారని విస్తృత ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేరున ఆన్లైన్లో నమోదు(మ్యుటేషన్)కు ప్రయత్నాలు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 19 కి.మీ. మేర సముద్రతీరం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ముంపునీరు సముద్రంలోకి ప్రవహించేందుకు వీలుగా గతంలో ఉప్పుటేరు, క్రీకులు ఉండేవి. వాటి ఆయకట్టులో వేలాది ఎకరాల్లో మడ అడవులు, పోరంబోకు, అన్సర్వే ల్యాండ్ ఉండేది. ప్రస్తుతం ఆ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. క్రయవిక్రయాలు జరిగి చేతులు మారుతున్నాయి.
మొగల్తూరు, న్యూస్టుడే
ధ్యలోనే నిలిచిన సర్వే..
సుమారు పదేళ్ల కిందట నరసాపురం సబ్కలెక్టర్గా పనిచేసిన రొనాల్డ్రోజ్ పేరుపాలెం సౌత్లోని మోళ్లపర్రు ప్రాంత భూముల్లో నిజమైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు సంకల్పించారు. సర్వే పనులు ప్రారంభించినా పూర్తికాలేదు. అవి మధ్యలోనే నిలిచిపోయాయి.
రూపం కోల్పోయిన నల్లీక్రీకు
నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం పేరుపాలెం వరకు ఉన్న నల్లీక్రీకు గత దశాబ్దకాలంగా ఆక్రమణకు గురై రూపం కోల్పోయింది. ప్రస్తుతం తూర్పుతాళ్లు వరకు కొంత మాత్రమే మిగిలి ఉంది. దీన్ని ఆక్రమించుకుని దాని గర్భంలో ఆక్వా చెరువులు తవ్వారు. ఆ భూములకు పైరవీలు చేసి పట్టాలు సంపాదించిన ఘనులూ ఉన్నారు.
ఉప్పుటేరు సమీపంలో..
సముద్ర ముఖద్వారంలో కలిసే ప్రాంతం నుంచి మోళ్లపర్రు బీచ్కు వెళ్లే ఆర్అండ్బీ రహదారి వరకు సుమారు ఐదు వందల ఎకరాలు పైబడి పట్టా, అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూములు నిత్యం వివాదంలో నానుతూ ఉంటాయి. ఒక్కొక్క భూమిపై ఇద్దరు, ముగ్గురు పేర్లపై పట్టాలు జారీచేసి ఉన్నాయి. ఎవరు అనుభవదారుడో తెలుసుకోవడం అధికారులకు కూడా కష్టమే. దీంతో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది.
క్రయవిక్రయాలు..
సుమారు పదిహేనేళ్ల కిందట ఇతర ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన భూదందా కొనసాగుతూ వచ్చింది. అలా ఆక్రమించుకున్న వందలాది ఎకరాల ప్రభుత్వ, మడ అడవుల భూములను ఆక్వా చెరువులుగా మార్పు చేశారు. వాటిని లీజుకు ఇవ్వడం, విక్రయాలకు పాల్పడటం చేస్తున్నారు.
యజమానులకూ తప్పని అవస్థలు
ఆయా ప్రాంతాల్లో పూర్వం నుంచి సాగుచేసుకుంటున్న వారిలో పలువురికి సరైన ధ్రువపత్రాలు లేవు. దీంతో వారంతా రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, దళారుల ద్వారా హక్కు పత్రాల కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తూ ఏదో ఒక పత్రం సంపాదిస్తున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పైసలు ముట్టజెబితే పనవుతుందని తెలుసుకున్న మరికొంతమంది రూ.లక్షలు చెల్లించి తమ స్వాధీనంలో ఉన్న భూమిని కుటుంబసభ్యుల పేరున రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఆయా భూములకు నకిలీ పట్టాలు సృష్టించిన ఘటనలూ ఉన్నాయి.
మంచి డిమాండు..
తీరప్రాంతం పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ భూములకు మంచి డిమాండ్ వచ్చింది. ఈ ప్రాంతంలో జిరాయితీ మెరక భూమి ఎకరం రూ.కోటి నుంచి మూడు కోట్ల వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జిరాయితీ చెరువు భూములకు రూ.50 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఆక్రమణ, పట్టాభూములను ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చెరువులకు ఎకరానికి ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు లీజు వసూలు చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
మొగల్తూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన లావాదేవీల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలో ఉన్న భూములపై సర్వే చేయాల్సి ఉంది.
జి.అనితాకుమారి, తహశీల్దారు, మొగల్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే