పుస్తకాలిస్తే అక్రమాలు లెక్క కట్టేస్తారు!
పెనుగొండ మండలం ములపర్రులో ఒక డ్వాక్రా నాయకురాలి నిర్వాకం వల్ల సభ్యులు రూ.లక్షల్లో నష్టపోయారు.
మండలాల్లో మొదలైన అతివల ఆడిటింగ్
పాలకొల్లు, న్యూస్టుడే
పద్దులు చూస్తున్న సామాజిక ఆడిటర్లు
*పెనుగొండ మండలం ములపర్రులో ఒక డ్వాక్రా నాయకురాలి నిర్వాకం వల్ల సభ్యులు రూ.లక్షల్లో నష్టపోయారు. ఎంతకీ అప్పు తీరకపోవడంతో గత నెలలో బ్యాంకు అధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించలేదని తేలింది. లబోదిబోమంటూ సదరు నాయకురాలిని నిలదీయగా నెలరోజుల్లో చెల్లిస్తానని చెప్పి చేతులెత్తేశారు. ఉమ్మడి జిల్లాలో ఇటువంటి అక్రమాలు మోసాలు డ్వాక్రా సంఘాల్లో అనేకం జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని అరికట్టడానికి సామాజిక ఆడిటర్లు అందుబాటులోకి వచ్చారు. ఆయా సంఘాల బ్యాంకు పుస్తకాలు ఇతరాత్ర వీరికిస్తే అక్రమాలను లెక్కకట్టేస్తారు. పొదుపు సంఘాల్లో పారదర్శకంగా సేవలు కొనసాగడానికి వీరు నడుంకట్టాల్సి ఉంది.
సగటున ఆరుగురు...
ఉమ్మడి జిల్లాలోని 48 మండలాల్లో పొదుపు సంఘాల్లో విద్యావంతులైన 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలను మండలానికి సగటున 6 నుంచి 8 మందిని సామాజిక ఆడిటర్లుగా నియమించి శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామాల వారీగా పొదుపు సంఘాల లెక్కలు తేలుస్తారు. మొదట ఐకేపీ నుంచి ఆయా సంఘాలకు అందుబాటులో ఉన్న సేవలను వివరిస్తారు. సందేహాలుంటే నివృత్తి చేస్తారు. అనంతరం సంఘాల పుస్తకాలను సమగ్రంగా పరిశీలించి వాటిలో ఉన్న లావాదేవీలను సభ్యులకు తెలియజేస్తారు. ఇలా చెప్పినప్పుడు సభ్యులకు ఏదైనా తెలియకుండా జరిగిన లావాదేవి ఉంటే బయటపడే అవకాశం ఉంటుంది.
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత...
సంఘాలను ఆడిటింగ్ చేసినందుకు కొత్తసంఘాలకైతే ఒక్కో సంఘానికి రూ.250, పదేళ్లు పైబడిన సంఘాలకు రూ.350 చొప్పున ఆడిటర్లకు చెల్లించాల్సి ఉంది. కొన్నిచోట్ల ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిసిన సెర్ఫ్ అధికారులు గ్రామ పరిధిలోని సంఘాలన్నీ గ్రామ సమాఖ్యకు ఆడిటింగ్ రుసుం చెల్లించాలని గ్రామ సమాఖ్య నుంచి ఒక చెక్కురూపంలో ఆడిటర్లకు అందించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలోను వెయ్యి నుంచి 1600 సంఘాల వరకు ఉన్నాయి. రోజుకు 4నుంచి 5 సంఘాలను ఆడిటింగ్ చేస్తే రూ.1000 నుంచి రూ.1250 వరకు కనీసం సంపాదించుకునే అవకాశం దక్కుతుంది. ఏటా వీరికి మూడు లేక నాలుగు నెలల పాటు ఉపాధి లభించనుంది. దీనిపై డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా జిల్లా మొత్తం మీద ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఫలితాలు త్వరలో వస్తాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట