అందరికీ ఆత్మీయుడు అంబేడ్కర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాల వారికి ఆత్మీయుడని ఉప మఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు.
భీమవరంలో కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆవిష్కరించిన విగ్రహం వద్ద మండలి ఛైర్మన్ మోసేనురాజు, మంత్రులు కొట్టు, కారుమూరి, ఎమ్మెల్యే గ్రంధి తదితరులు
భీమవరం గునుపూడి, న్యూస్టుడే: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాల వారికి ఆత్మీయుడని ఉప మఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. భీమవరం గునుపూడిలో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్లతో కలిసి సోమవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగిన మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. తొలుత మండలి ఛైర్మన్ మోసేనురాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనతో ఆర్యవైశ్య వర్తక సంఘాల ఆధ్వర్యంలో భారీ కేకు కోయించారు. అక్కడి నుంచి ప్రకాశంచౌక్ మీదుగా అశ్వరథంపై ఊరేగింపుగా ఆదివారం బజార్లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం గునుపూడిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు మోసేనురాజును పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
-
World News
Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్ఫోర్స్లో కీలక పదవి..!
-
General News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని
-
Sports News
Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ
-
Movies News
RGV: షారుఖ్ పని అయిపోయిందన్నారు.. ‘పఠాన్’ బదులిచ్చింది