logo

మిద్దెతోటల పెంపకంపై శిక్షణ

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కేవీకేలో సోమవారం మిద్దెతోటల పెంపకంపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు.

Published : 29 Nov 2022 05:47 IST

మెలకువలు నేర్చుకుంటున్న మహిళా రైతులు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కేవీకేలో సోమవారం మిద్దెతోటల పెంపకంపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు కరుణశ్రీ, వావిలపల్లి దీప్తి పట్టణ ప్రాంతాల్లో కుండీల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలపై అవగాహన కల్పించారు. అనంతరం విత్తనాల ప్యాకెట్లు, జీవ ఎరువులు, జిగురు అట్టలు, కుండీలు, వేపనూనె పంపిణీ చేశారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని