logo

ఎమ్మార్‌ అప్పారావు కాలనీపై ప్రత్యేక నిఘా

నూజివీడు ఎమ్మార్‌ అప్పారావు కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు నూజివీడు పట్టణ సీఐ మూర్తి తెలిపారు.

Published : 02 Dec 2022 05:53 IST

నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ మూర్తి, ఎస్సై

నూజివీడు, న్యూస్‌టుడే: నూజివీడు ఎమ్మార్‌ అప్పారావు కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు నూజివీడు పట్టణ సీఐ మూర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆ కాలనీలో గంజాయి పీల్చుతూ పట్టుబడిన సయ్యద్‌ యాసిన్‌ అనే యువకుడి అరెస్టుకు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్‌ అప్పారావు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో యాసిన్‌ గంజాయి పీల్చుతుండగా సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై శివనారాయణ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు 250 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి అందులో 150 గ్రాములు వినియోగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇక్కడ జనార్దన్‌ పండు అనే వ్యక్తిని గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని