ఆవేదన విని.. ఆలోచన పంచుకొని..
బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు.
కులాల వారీగా సమస్యలను వివరించిన నాయకులు
వెన్నుదన్నుగా నిలుస్తామన్న చంద్రబాబు నాయుడు
రజక సంఘ నాయకుడి సమస్యలను వింటున్న చంద్రబాబు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని దండమూడి రామలక్ష్మి కల్యాణ మండపంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్చంద్రశేషు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. బీసీ సాధికార ఫెడరేషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించారు. సదస్సు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉందంటే అది బీసీలకేనన్నారు. తెదేపా అంటే బీసీల పార్టీ, బీసీలంటే తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వాతంత్య్రానంతరం పూర్తిగా నష్టపోయిన వర్గాలు బీసీలేనన్నారు. కులవృత్తుల్లో పెను మార్పులు వచ్చి దెబ్బతిన్న కులాలు అవేనన్నారు. అట్టడుగున ఉన్న వీరిని ఆదుకోవాలని నిర్ణయించి, అమలు చేసింది ఎన్టీ రామారావు అన్నారు. సభాధ్యక్షుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీ కులాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల వారీగా సమస్యలు వివరిస్తే వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకుందామని వివరించారు. సదస్సులో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు అంగర రామమోహన్, సత్యనారాయణరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత, నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పాలి ప్రసాద్, జయమంగళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
విన్నపాలు ఇలా..
మద్యం వ్యాపారం గౌడ, శెట్టిబలిజ తదితర కులాల వారి వృత్తి. ఆ వృత్తిని ప్రభుత్వం దోచుకుంటోంది. మద్యం వ్యాపారంలో 20 నుంచి 25 శాతం ఆయా కులాలకు కేటాయించాలని తెదేపా రాష్ట్ర బీసీ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, గౌడ సంఘం నాయకులు రాంబాబు, దాసరి లోకేష్ తదితరులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తాటిచెట్లు పెంచుకోవడానికి స్థలాలు కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలత తెలిపిన చంద్రబాబు ఎంత శాతం కేటాయించాలన్నది వెల్లడిస్తామన్నారు. పలు సంఘాల నాయకులు సమస్యలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
* జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని, ఒకటి కొప్పులవెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాన సత్యనారాయణ కోరారు.
* కొల్లేరులోని ఖాళీ భూములను వడ్డీలకు ఒక్కో కుటుంబానికి అరెకరం చొప్పున ఇప్పించాలని ఆ సామాజికవర్గం నాయకుడు రామరాజు విన్నవించారు. డ్రెయిన్లు శుభ్రం చేయాలని కోరారు.
* మట్టి వృత్తుల వారు అణగారిపోతున్నారని ఆ సంఘం నాయకుడు గోపికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
* చెరువులపై రజక వృత్తిదారులకు అధికారం ఇప్పించాలని ఎన్.సూర్యనారాయణ విన్నవించారు.
* తూర్పుకాపులు పశ్చిమలోనూ ఎక్కువగా ఉన్నారని, రాజకీయంగా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెదేపా నాయకుడు కరణం పెద్దిరాజు కోరారు.
* వివిధ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల సమస్యలను పార్టీ బీసీ నాయకుడు చిట్రోజు తాతాజీ వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. వివిధ సమస్యలపై ఆయా సంఘాల నేతలు చంద్రబాబుకు వినతిపత్రాలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం