logo

జగన్‌ పాలనలో అన్నీ సమస్యలే: తోట

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

Published : 05 Dec 2022 05:07 IST

స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న సీతారామలక్ష్మి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని భీమవరం మూడో పట్టణ పరిధి బొక్కావారిపాలెంలో ఆమె ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి సంబంధించిన కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి తదితరులు మాట్లాడారు. మహిళలు ప్రస్తావించిన సమస్యల వివరాలను పార్టీ రాష్ట్ర కమిటీకి పంపిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి పాలా శ్రీరామదాసు, యూనిట్‌ ఇన్‌ఛార్జి గూడూరి సుబ్బారావు, బూత్‌ ఇన్‌ఛార్జి గూడూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని