logo

ధాన్యాన్ని కొనలేని ప్రభుత్వమిది: గన్ని

రైతుల నుంచి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు.

Published : 05 Dec 2022 05:07 IST

రైతులతో మాట్లాడుతున్న వీరాంజనేయులు

భీమడోలు, న్యూస్‌టుడే: రైతుల నుంచి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు. ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ నిరసన కార్యక్రమంలో భాగంగా గుండుగొలను తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన  తెదేపా నాయకులతో కలిసి పర్యటించారు. రహదారుల వెంబడి ధాన్యం ఆరబోసుకుంటున్న రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ రైతుల కష్టాలు చూసి కూడా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నటిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు శిరిబత్తిన వీరవెంకటసత్యనారాయణ, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని