నేలతల్లి.. తల్లడిల్లి
కాలుష్య కారకాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతుండటంతో పుడమి తల్లి విలవిల్లాడుతోంది.
కాలుష్య కారకాలతో భూమి నిస్సారం
ఉండి, భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్టుడే
సీసలిలో ఫ్యాక్టరీ కాలుష్యంతో దెబ్బతిన్న వరి చేను
కాలుష్య కారకాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతుండటంతో పుడమి తల్లి విలవిల్లాడుతోంది. అవసరాలకు అనుగుణంగా పంట దిగుబడులు పెంచడమే లక్ష్యంగా రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో భూమి సహజ స్వభావాన్ని కోల్పోయి నిస్సారంగా మారుతోంది. జల కాలుష్యంతో చౌడు, ఉరక భూముల సమస్య పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పుతెచ్చి భూసార పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించే కార్యక్రమాలు చేపట్టాలని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ (ఐయూఎస్ఎస్) 2002లో సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఏటా డిసెంబరు ఐదున మృత్తికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నేలల పరిస్థితిపై న్యూస్టుడే ప్రత్యేక కథనం.
కారణాలు ఇవి..
* పరిశ్రమల నుంచి వ్యర్థాలను జలవనరుల్లోకి వదిలేయడం. * సాగులో ఎరువులు, పురుగు, కలుపు మందుల వినియోగం పెరిగిపోవడం * నీరు ఒకేచోట నిల్వ ఉండటం * వరదలు, భారీ వర్షాల సమయంలో భూమి పైపొర కొట్టుకుపోవడం * యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడంతో నత్రజని, ఇనుము, జింకు, గంధకం, మాంగనీసు, బోరాన్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
పురుగు మందు పిచికారీ
మన నేల ఇలా..
ఉమ్మడి జిల్లాలో నేల స్వరూపం విభిన్నం. మెట్టలో ఎర్రనేలలు, డెల్టాలో నల్లరేగడి, ఇసుక నేలలు విస్తరించి ఉన్నాయి. శాతాల్లో వివరాలు ఇలా..
ఎర్రనేలలు- 33
ఇసుక- 30
నల్లరేగడి- 24
ఇతర నేలలు- 13
చిన్న కమతాలే ఎక్కువ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 48 మండలాల్లో 11,65,680 ఎకరాల భూమి సాగులో ఉంది. చిన్న, సన్నకారు రైతుల చేతుల్లోనే 7,38,636 ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రధాన పంట వరి. తర్వాత ఆక్వా (చేపలు, రొయ్యల) చెరువులున్నాయి. చెరకు, ఆయిల్పామ్, కోకో, అరటి, కొబ్బరి, మొక్కజొన్న, పొగాకు, కూరగాయలు, వివిధ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వరి సాగయ్యే విస్తీర్ణం రాన్రానూ తగ్గిపోతోంది. నేల కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.
చౌడు తగ్గాలంటే..
ఆక్వా చెరువుల్లో వ్యర్థ జలాలను యథేచ్ఛగా కాలువల్లోకి వదిలేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో చౌడు, ఉరకభూముల సమస్య పెరుగుతోంది. ఈ తరహా సమస్య ఉన్న భూమిలో పైపొరను చెక్కి తీసేయాలి. తర్వాత చిన్న మడులుగా మార్చుకొని 15 సెంటీమీటర్ల లోతున నీరు పెట్టి నాలుగైదు రోజులు ఉంచి తీసేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే ఆ భూముల్లో చౌడు సాంద్రత చాలావరకు తగ్గుతుంది. వేసవిలో జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పెంచి భూమిలో కలియదున్నితే చౌడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
ఎంవీ కృష్ణాజీ, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధన స్థానం, మార్టేరు
సేంద్రియ సేద్యమే రక్ష
భూసారం స్థిరంగా ఉండాలంటే సేంద్రియ సేద్యమే మార్గం. సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల గుల్లబారి తేమ నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. సాగుకు ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. భూ ఆరోగ్య ఫలితాల ఆధారంగా నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఎరువులు చల్లుకోవాలి. మురుగు నీటిపారుదల సౌకర్యాన్ని సరైన రీతిలో ఏర్పాటుచేసుకోవాలి.
ఎన్.మల్లికార్జునరావు, సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు