విద్యుత్తు లేక.. పనులు సాగక
జంగారెడ్డిగూడెం జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తికాక లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు.
నీళ్లు కొనుక్కుంటున్న లబ్ధిదారులు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే
కొనుగోలు చేసిన నీటితో ఎల్-2లో నిర్మాణ పనులు
జంగారెడ్డిగూడెం జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తికాక లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడి ఎల్-2, 3 లేఅవుట్లలో లైన్ల నిర్మాణం నిమిత్తం సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం కండక్టర్ల నిర్మాణంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు అమర్చాల్సి ఉంది. ఈ కారణంగా నీళ్లు లేక గృహ నిర్మాణ లబ్ధిదారులు, ఆ పనులు చేసేందుకు ఒప్పందం చేసుకున్న మేస్త్రీలు నానా అవస్థలు పడుతున్నారు. చేసేది లేక కొందరు ఒక్కో నీటి ట్యాంకర్ను రూ.1000 నుంచి రూ.1200 పెట్టి కొనుగోలు చేసి పనులు చేస్తున్నారు. పురపాలక సంఘం సరఫరా చేసే నీరు అరకొరగా అందుతోంది.
నీటి ఖర్చు రూ.8 వేలు.. ‘రెండు నెలలుగా విద్యుత్తు సరఫరా లేక మోటార్లు తిరగడం లేదు. మా అమ్మ నాగిని పేరున ఇల్లు మంజూరైంది. నీటిని కొనుక్కొని కట్టుకుంటున్నాం. ఆయా ట్యాంకర్లకు ఇప్పటివరకు రూ.8 వేలు ఖర్చయింది. అయినా పూర్తిగా తడపనందున ఇంటి గోడలు బీటలు వారుతున్నాయి. చేసేది లేక ప్లాస్టింగ్ చేయించాం. వృత్తిరీత్యా నేను తాపీ పనిచేస్తా. మున్సిపల్ ట్యాంకర్ వస్తున్నా సరిపోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం’ అని షేక్ జానీ తెలిపారు.
ఆగిన నిర్మాణాల్లో మొలిచిన మొక్కలు
పీపా రూ.100..
‘మేము కట్టుకుంటున్న ఇంటి పక్కన పొలం ఉంది. అందులో నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. అయినప్పటికీ పునాదుల వరకు రెండు ట్యాంకర్ల నీరు కొన్నా. మరీ అవసరమైతే పీపాకు రూ.100 ఇచ్చి కొంటున్నాం. పొలాల పక్కనుందని మున్సిపల్ సిబ్బంది మాకు ట్యాంకర్ నీరు ఇవ్వడం లేదు’ అని కె.ఉదయ్ గణేష్ చెప్పారు.
కొనుక్కొని కడుతున్నా
‘నేను నాలుగు ఇళ్లు కట్టడానికి ఒప్పందం చేసుకున్నా. రెండు నెలలుగా నీరు, కరెంటు లేదు. ట్యాంకర్కు రూ.800 చొప్పున చెల్లించి కొనుగోలు చేసి కడుతున్నాం. నాలుగు ఇళ్లకు కలిపి రోజూ ఒక ట్యాంకరు కొంటున్నా’ అని తాపీమేస్త్రీ శివ పేర్కొన్నారు. ‘రెండు లే అవుట్లలో ప్రస్తుతం లైన్ల నిర్మాణం జరుగుతున్నందున ఇబ్బంది ఉండొచ్చు’ అని విద్యుత్తు ఈఈ అంబేడ్కర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.