మా ఊరి బస్సు విజయవాడకెళ్లింది
విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
జయహో బీసీ సభకు తరలిన వైనం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల ఇక్కట్లు
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే, కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, జంగారెడ్డిగూడెం, నూజివీడు
ఏలూరులో పడిగాపులు
విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూశారు. ఓపిక లేక చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇందులో పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అదనంగా వసూలు చేశారు.
సాయంత్రం 6గంటలకు ఏలూరు బస్టాండులో నిరీక్షిస్తూ..
జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు.. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, రావులపాలెం, రాజమహేంద్రవరం, ద్వారకాతిరుమల, చింతలపూడి, మచిలీపట్నం, నూజివీడు ఇలా చాలా మార్గాలకు పల్లె వెలుగు బస్సుల్లోనే అధిక శాతం ప్రయాణికులు వెళుతుంటారు. సభకు వెళ్లిన బస్సులల్లో ఇవే 90 శాతం ఉంటాయి. దీంతో సాధారణ ప్రయాణికులు, ఫాస్ట్ సర్వీస్ బస్సులు లేని గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. భీమవరం నుంచి రాజమహేంద్రవరానికి ప్రతి ఇరవై నిమిషాలకి ఒక సర్వీసు ఉంటుంది. బుధవారం గంటన్నరైనా బస్సు లేకుండా పోయింది. రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర మార్గాలతో పాటు ఇతర మార్గాల్లోనూ బస్సులు లేకుండా పోయాయి. పాలకొల్లు బస్టాండ్కు వచ్చే రాజమహేంద్రవరం బస్సులు 5, ఏలూరుకు వెళ్లే 3 బస్సులు సభకు వెళ్లడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికుల బస్సులే లేవు. ఇదే అదనుగా ఆటోవాలాలు అధికంగా వసూలు చేశారు. బీ ఉదయం నుంచి రాత్రి వరకు జంగారెడ్డిగూడెం డిపో నుంచి పోలవరం 14 సర్వీసులు నడపాల్సి ఉండగా వాటిని ఏడుకు పరిమితం చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆ మార్గంలో ప్రత్యామ్నాయ డిపో బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించారు. బీ కొయ్యలగూడెం మీదుగా తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం వెళ్లే బస్సులు తక్కువగా ఉన్నాయని కొయ్యలగూడెం బస్టాండులో ప్రయాణికులు వాపోయారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పెద్దసంఖ్యలో పడిగాపులు కాస్తూ కనిపించారు.
ప్రతి డిపో నుంచి తరలింపు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు డిపోలుండగా అన్నింటి నుంచీ మొత్తం 136 బస్సులను మళ్లించారు. అత్యధికంగా తణుకు నుంచి 24 బస్సులను తరలించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఏలూరు డిపోల నుంచి వరుసగా 21,21, 19, 16 బస్సులను మళ్లించారు.
జంగారెడ్డిగూడెంలో..
పెళ్ళిళ్లకు లేవు.. బుధవారం పెళ్లిళ్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, బస్సులు డిపోలో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఫలితం లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు. వారం నుంచి పెళ్లిళ్లకు బస్సులు ఇవ్వలేదు. ఇస్తే ఈ సమావేశానికి పంపేందుకు కొరత ఉంటుందని నిరాకరించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా