చేపా చేపా ఎంత తెస్తావ్!
ఫిష్ఆంధ్రా పేరిట చేపల విందు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. దీని కోసం బీఎఫ్ఎఫ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది.
ఆహార విక్రయశాలల ఏర్పాటుకు కసరత్తు
పాలకొల్లు, న్యూస్టుడే: ఫిష్ఆంధ్రా పేరిట చేపల విందు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. దీని కోసం బీఎఫ్ఎఫ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 20 నుంచి 30 ఆహారశాలలు(రెస్టారెంట్లు) ఏర్పాటు చేయాలని మత్స్యశాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలిప్పించి కొత్త ఏడాది నాటికి చేపల రుచులు పంచాలని అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఉభయతారకంగా.. ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రంలో ఏడాదికి వాటి తలసరి వినియోగం 8 కిలోలు మాత్రమే. ఉత్తర భారతదేశంలో ఇది 40 కిలోలకు పైగా ఉంది. దీని ప్రభావం ఇటు మార్కెట్పైనా, తర్వాత ప్రజారోగ్యం మీద ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చేపలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయనేది జనమెరిగిన సత్యం. అందువల్ల వాటితో తయారు చేసిన ఆహారం అందుబాటులోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ప్రస్తుతం ఆక్వా రైతుల ఉత్పత్తులకు తగిన ఎగుమతులు లేక ఆదాయం క్షీణించి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ తీసుకు రావాలన్నది మరో ఆలోచన. ఈ రెండింటిని కలగలిపి ఉభయతారకంగా చేపల ఆహారశాలలను తెరమీదికి తెచ్చారు. వీటిలో చేపలతోపాటు రొయ్యలు, పీతలు కూడా అందుబాటులో ఉంచుతారు. ఉన్న రకాలతోపాటు ఏ చేపలో ఏఏ పోషకాలు ఉంటాయనే జాబితాను మెనూలా అందుబాటులో ఉంచాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
రుణాలిలా.. నిరుద్యోగ యువతతోపాటు ఆహారశాలల ఏర్పాటుకు అభిరుచి ఉన్నవారికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంకు రుణాలివ్వాలని ప్రతిపాదించారు. దీనిలో 40శాతం రాయితీ అన్ని వర్గాలకు ఉంటుంది. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60శాతం రాయితీ లభించనుంది. రూ.10 లక్షలతో ఏర్పాటుచేసే ఆహారశాలను నిత్యరుచులు(డైలీ డెలీషియస్), రూ.20 లక్షలతో రానున్న ఆహారశాలకు సూపర్ అని, ఆపై లాంజ్ పేరిట పైఅంతస్తు నమూనాలో వీటిని నిర్మించనున్నారు. సూక్ష్మవంటశాలలు(స్మార్ట్ కిచెన్లు) వీటిలో అందుబాటులో ఉంటాయి.
వేడిగా వడ్డించేలా.. చేప అంటే కేవలం కూరలేగాక చేపల పకోడి, ఫ్రై, పిజ్జా, బర్గర్లు, స్నాక్స్, రొయ్య టిక్కాలు ఇతరత్రా ఆహారం అందుబాటులో ఉంచుతారు. వేడిగా వేగంగా ఆహారాన్ని అందించడంతోపాటు సరసమైన ధరలకు విక్రయించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
పోషకాలు అందించేందుకే.. ప్రజల ఆరోగ్యం పెంపొందించడంతోపాటు ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ పెంచడానికి చేపల ఆహారశాలలు ఉపయోగపడతాయి. పోషకాహారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరుకు పాలకొల్లులో రెండింటిని ప్రారంభించబోతున్నాం.
ఎల్.ఎల్.ఎన్.రాజు, మత్స్యశాఖ ఉపసంచాలకుడు, భీమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.