logo

కోటసత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ వారి తిరునాళ్లు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 08 Dec 2022 04:34 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ వారి తిరునాళ్లు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి దంపతులు కలశస్థాపనతో శ్రీకారం చుట్టారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విద్యుత్తు దీపాల కాంతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని