ఇక కొనలేం!
‘ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేశాం. ఇంకా కొనలేం.. మీరు బయట ఎవరికైనా అమ్ముకోండి’ ఇది జిల్లా వ్యాప్తంగా చాలా రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు చెబుతున్న మాట.
లక్ష్యం పూర్తయిందంటూ చేతులెత్తేస్తున్న ఆర్బీకే సిబ్బంది
వెనక్కి పంపిస్తున్న వైనం
భయపెడుతున్న వరుణుడు
ఈనాడు డిజిటల్, ఏలూరు
ఈ చిత్రం చూస్తుంటే.. రైతులు ధాన్యం అమ్మేసిన తర్వాత హడావుడిగా పోగు చేస్తున్నట్లు ఉంది కదా..వాస్తవ పరిస్థితి వేరు. వీరంతా నిడమర్రుకు చెందిన రైతులు. ధాన్యం విక్రయం కోసం రెండు రోజులు అడవికొలను రైతు భరోసా కేంద్రాల చుట్టూ సంచుల కోసం తిరిగారు. సిబ్బంది కొనుగోలు లక్ష్యం పూర్తయిందని కొనలేమని చెప్పారు. ఇంతలో శుక్రవారం వర్షం మొదలుకావటంతో చినుకుల్లోనే ధాన్యం ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇలా అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులది ఇదే పరిస్థితి.
‘ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేశాం. ఇంకా కొనలేం.. మీరు బయట ఎవరికైనా అమ్ముకోండి’ ఇది జిల్లా వ్యాప్తంగా చాలా రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు చెబుతున్న మాట. ఒకవైపు కల్లాల్లో ధాన్యం.. మరో వైపు భయపెడుతున్న వాతావరణంతో అన్నదాత వెన్నులో వణుకు పుడుతోంది. కల్లాల్లో ధాన్యానికి బరకాలు కప్పుకొని ఎవరు కొంటారా అని కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు.
* నిడమర్రు మండలం అడవికొలనులో రెండు రైతుభరోసా కేంద్రాలున్నాయి. 1వ కేంద్రానికి 1500, రెండో కేంద్రానికి 1100 మెట్రిక్ టన్నుల లక్ష్యం నిర్దేశించారు. ఇది ఇప్పటికే పూర్తి కావటంతో కొనుగోలు చేయటం లేదు. ఎంత మంది వచ్చి అడిగినా మా లక్ష్యం పూర్తయిందని చెబుతున్నారు. ఈ రెండు కేంద్రాల పరిధిలో ఇంకా 500 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే కల్లాల్లో ఉంది. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
నిర్లక్ష్యం చేస్తున్నారు: ‘రైతులకు గిట్టుబాటు ధర అందిస్తాం..దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేయిస్తాం’ అంటూ అధికారులు, నాయకులు ప్రసంగాల్లో ఊదరకొడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో కొనుగోలు లక్ష్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల కాగా ఇప్పటి వరకూ లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంది. ఏటా జిల్లాలో లక్ష్యం నిర్దేశించుకునే వారు.. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల వారీగా లక్ష్యం నిర్దేశించారు. ఈ లక్ష్యం కంటే క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యం చాలా ఎక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొవ్వలి, నారాయణపురం, పోతునూరు, నిడమర్రు తదితర ప్రాంతాల్లో రైతుభరోసా కేంద్రాల్లో లక్ష్యం పూర్తి కావటంతో ధాన్యం కొనటం లేదు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సమస్య మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది.
లక్ష్యం పెంచినా ఇబ్బందే: కొవ్వలిలో గత నాలుగు రోజులుగా ధాన్యం కొనక రైతులు అవస్థలు పడ్డారు. అధికారుల చుట్టూ తిరిగితే ఆ రోజు లక్ష్యం కొంత పెంచారు. ఇది జిల్లా లక్ష్యం కాదు. ఆర్బీకేల్లో మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో రైతులకు ఉపశమనం లభించినా మరో చోట ఇదే సమస్య వస్తుంది. జిల్లా లక్ష్యం పెంచితే ఆ మేరకు అన్ని ఆర్బీకేల్లో పెరుగుతుంది.ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
వట్లూరులో హడావుడిగా పనలను కుప్పలుగా పెడుతూ
వర్షంతో వణుకు: జిల్లావ్యాప్తంగా శుక్రవారం జల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. ఒక వైపు ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోలేక అగచాట్లు పడ్డారు. ఇప్పటి వరకూ ఆరిన ధాన్యానికి ఈ వర్షానికి మళ్లీ తేమ పెరుగుతుందనే భయంతో బరకాల కప్పుకుని తిండీతిప్పలు లేకుండా కాపలా కాస్తున్నారు.
నేను సాగు చేస్తున్న ఎకరంలో ధాన్యం అమ్మేందుకు ఆర్బీకేకి వెళితే సిబ్బంది లక్ష్యం పూర్తి అయిందని చెబుతున్నారు. సంచులు ఇవ్వటం కుదరదన్నారు. వర్షం పడటంతో బరకాలు కప్పినా తేమశాతం పెరిగితే ధాన్యం ఎవరు కొంటారు. ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
పైడికొండల శివాజీ, రైతు, అడవి కొలను
నాలుగెకరాల్లో కౌలు సాగు చేశాను. ధాన్యం నూర్పిడి చేసి రెండు వారాలవుతోంది. సంచుల కోసం అడవికొలను ఆర్బీకేకి వెళితే ఇప్పటికే లక్ష్యం పూర్తయిందని కొనుగోలు చేయటం కుదరదని చెబుతున్నారు. వర్షం నుంచి కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాను. ఒక్కో బరకాకు రోజుకు రూ.20 అద్దె కట్టాలి. ఇప్పుడు ధాన్యం ఎవరికి అమ్మాలి.
పి.భోగేశ్వరరావు, కౌలు రైతు అడవికొలను
లక్ష్యం ప్రకారమే కొంటాం
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కువ ఉంటే రైతులు ఎవరికైనా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారమే అమ్ముకోవచ్చు. రైతుభరోసా కేంద్రాల్లో ఇబ్బంది ఉంటే పక్కన కేంద్రాల్లో సర్దుబాటు చేస్తాం. కానీ జిల్లా లక్ష్యం మాత్రం మార్పు చేసే అవకాశం లేదు.
అరుణ్బాబు, జేసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే