logo

ట్రాక్టర్‌ బోల్తా.. చోదకుడు దుర్మరణం

పెదపాడు మండలం కొత్తూరులో ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి చెందినట్లు ఎస్సై బి.నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.

Published : 20 Jan 2023 05:19 IST

ప్రమాదానికి గురైన వాహనం

పెదపాడు, న్యూస్‌టుడే: పెదపాడు మండలం కొత్తూరులో ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి చెందినట్లు ఎస్సై బి.నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుట్టాయగూడేనికి చెందిన రెడ్డి శ్రీను (51) పెదపాడు మండలం కొత్తూరులోని ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. పచ్చి ఇటుకలు తయారు చేయడానికి గురువారం దమ్ము చక్రాల ట్రాక్టర్‌తో మట్టిని తొక్కుతున్నాడు. అది తిరగబడి మీదపడటంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇటుక బట్టీ యజమాని ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని