logo

సర్వే కచ్చితంగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

వాలంటీర్లు బేస్‌లైన్‌ సర్వేను కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు.

Published : 24 Jan 2023 05:41 IST

హాజరైన అధికారులు. మాట్లాడుతున్న ప్రశాంతి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: వాలంటీర్లు బేస్‌లైన్‌ సర్వేను కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివరాలు పొందుపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, వివరాలు వెబ్‌సైట్‌లో ఒక విధంగా, సంబంధిత శాఖల వద్ద మరోలా ఉంటున్నాయన్నారు. బడి ఈడు పిల్లల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీవో కె.శ్రీనివాసరావు, జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి అప్పారావు, జిల్లా వైద్యశాఖాధికారి మహేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ సుజాతరాణి, డీఈవో వెంకటరమణ, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని