భీమవరంలో కాషాయ వేడుక
రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో భీమవరంలో కాషాయమయమైంది.
రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన భాజపా నాయకులు, ప్రతినిధులు
హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో భీమవరంలో కాషాయమయమైంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాల్లో పలు తీర్మానాలు, తాజా, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైకాపా ప్రభుత్వం తమవిగా గొప్పలు చెప్పుకోవడంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందేమాతరం నినాదంతో..
రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రాంగణం వందేమాతరం నినాదంతో మార్మోగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్పవార్, మురళీధరన్, జాతీయ నాయకులు శివప్రకాశ్, సునీల్ దేవధర్, మధుకర్, ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించారు. అనంతరం సభా కార్యక్రమాలను కొనసాగించారు.
క్రమశిక్షణతో..
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 400కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 23న పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ స్థాయి శక్తి కేంద్రాలను పరిశీలించిన ఆవాస్ ప్రతినిధులు అదే ప్రాంతంలోని పార్టీ కార్యకర్తల ఇళ్లలో బస చేశారు. భీమవరం జువ్వలపాలెంరోడ్డులోని ఆనంద ఫంక్షన్ హాలుకు ఉదయం చేరుకున్నారు. ప్రతినిధులను సమావేశ మందిరంలోకి పంపే ముందు మహిళా మోర్చా నాయకులు, ప్రతినిధులు తిలకం దిద్ది ఆహ్వానించారు. పార్టీ కండువా వేసుకుని, తలపై భాజపా జెండా గుర్తుతో కూడిన టోపీ ధరించి పాల్గొన్నారు. పార్టీ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాస వర్మ, నార్ని తాతాజీ, పేరిచర్ల సుభాష్, కాయిత సురేంద్ర, కోమటి రవికుమార్ తదితరులు పర్యవేక్షించారు.
విప్లవ వీరునికి నివాళులు
కార్యవర్గ సమావేశానికి ముందు పార్టీ జాతీయ నాయకుడు శివ ప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సందర్శించారు. ప్రాంగణ సుందరీకరణను పరిశీలించారు.
మావుళ్లమ్మ ఆలయంలో..
కార్యవర్గ సమావేశాలకు హాజరైన పలువురు నాయకులు, ప్రతినిధులు మావుళ్లమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహోత్సవాల గురించి తెలుసుకున్నారు.
అభివృద్ధిని తెలియజేద్దాం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయి నుంచి వివరించేలా తమ వంతు భూమిక ఉంటుందని మహిళా మోర్చా నాయకులు అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాల గోడపత్రాన్ని కేంద్రమంత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు