పెళ్లి కళ వచ్చిందండోయ్!
భజంత్రీలు మోగే సమయం ఆసన్నమైంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలున్నాయి.
నేటి నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు
ఉంగుటూరు, న్యూస్టుడే: భజంత్రీలు మోగే సమయం ఆసన్నమైంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు ఎవరికివారు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతీయువకులు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. పెళ్లి కాగానే విదేశాలకు వెళ్లాల్సిన కొత్త దంపతులు ముందుగానే ఇందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నెలన్నర పాటు ఎటు చూసినా పందిళ్లు...సందళ్లు..కల్యాణ మండపాలు మొదలు వాటిపై ఆధారపడి ఉన్న పలు రంగాలకు డిమాండ్ ఏర్పడింది.
అనుబంధ రంగాలకు ఉపాధి.. పెళ్లంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. పురోహితులు, వంటల తయారీదారులు, షామియానాలు సమకూర్చేవారు, ఫొటోగ్రాఫర్లు, లైటింగ్, పూల అలంకరణ చేసేవారు, మంగళ వాయిద్యాలు, దర్జీలు, ఆభరణ తయారీ దారులు, ఐస్క్రీం, బ్యూటీ పార్లర్లు, కూరగాయల సరఫరాదారులకు ఇప్పటికే గిరాకీ పెరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో 350 వరకు కల్యాణ మండపాలు ఉన్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు నిర్వాహకులు ఒక్కసారిగా అద్దె ధరలు పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తేదీలు ఇవే..
గతేడాది డిసెంబరు 2 నుంచి 18వ తేదీ వరకు పరిమిత ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు తక్కువగానే జరిగాయి. ఈ నెల 26, 27, 28, ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15, 16, 23, 24, మార్చి 1, 5, 8, 9, 10, 11, 13, 15, 17 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’