పురోభివృద్ధికి పునరంకితం
త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకుని జిల్లా ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుదాం’ అని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పేర్కొన్నారు.
వ్యవసాయంతో పాటు అన్ని రంగాల ప్రగతిపై దృష్టి
గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్
ఈనాడు డిజిటల్, ఏలూరు
పోలీసుల కవాతును వీక్షిస్తూ గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్
ప్రసన్న వెంకటేశ్, జేసీ అరుణ్బాబు, ఎస్పీ రాహుల్దేవ్శర్మ
త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకుని జిల్లా ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుదాం’ అని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పేర్కొన్నారు. ఏలూరు పోలీస్ కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దిన వేడుకలు నిర్వహించారు. ఆయన ముందుగా జాతీయజెండాను ఆవిష్కరించి..పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వ్యవసాయం, దిశ, పోలీసు, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, జలవనరులు, విద్యా, వైద్యఆరోగ్య తదితర శాఖలు దాదాపు 15 శకటాలను ప్రదర్శించాయి. విద్య ప్రాధాన్యత తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ, వ్యవసాయశాఖకు ద్వితీయ బహుమతులు దక్కాయి. పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 234 మంది ఉద్యోగులకు, సిబ్బందితోపాటు వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు కలెక్టర్ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు సందర్శించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్, శాసనమండలి సభ్యుడు షేక్ సాబ్జీ, ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్దేవ్శర్మ, జేసీ అరుణ్బాబు, డీఆర్వో మూర్తి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.600 కోట్లతో జల్జీవన్ మిషన్ పనులు
జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ ప్రసంగించారు. ‘వ్యవసాయ రంగంతోపాటు అన్ని రంగాల పురోగతిపై దృష్టి కేంద్రీకరించాం. జిల్లాలో 540 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నాం. ఖరీఫ్లో 3.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.625కోట్లు రైతులకు జమ చేశాం. ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ అందిస్తున్నాం. మాతాశిశు మరణాల నియంత్రణకు పీహెచ్సీ, సీహెచ్సీల్లో 24 గంటలు సేవలు అందిస్తున్నాం. నాడు-నేడులో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తున్నాం. రూ.600 కోట్లతో జల్జీవన్ మిషన్ పనులు చేపట్టాం. రూ.205 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా 164 గ్రామాలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 685 గ్రామీణ రహదారుల పనులు చేపడుతున్నాం. రూ.18 కోట్లతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నాం. రైతుభరోసా, సచివాలయాలు, ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో సింగిల్ విండో విధానంలో 188 పరిశ్రమలకు అనుమతులిచ్చాం’ అని పేర్కొన్నారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం ముందు పంట ఉత్పత్తులతో రైతులు
ఏలూరు సెయింట్ థెరిసా బాలికోన్నత పాఠశాల విద్యార్థుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..