భర్తీ కాని ఖాళీలు.. వీడని కరెంటు కష్టాలు
జంగారెడ్డిగూడెం పట్టణవాసులు తరచూ కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పుడు ఆ శాఖలోని సిబ్బంది కొరత కూడా తోడైంది.
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే
పాత తహశీల్దారు కార్యాలయం రోడ్డులో తీగలకు అల్లుకున్న పాదులు
జంగారెడ్డిగూడెం పట్టణవాసులు తరచూ కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పుడు ఆ శాఖలోని సిబ్బంది కొరత కూడా తోడైంది. మరోవైపు అవినీతి వ్యవహారాలతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఇటీవల విద్యుత్తు స్తంభం మార్చేందుకు ఇక్కడి జేఎల్ఎం జీవరత్నం రూ.20వేలు వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఏఈతో పాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది కొరత కూడా ఉంది. ఇక్కడ విధులు నిర్వర్తించడానికి అధికారులు, ఉద్యోగులు ఐచ్ఛికం ఇవ్వకపోవడంతో భర్తీ కావడం లేదు.
చింతలపూడి విభాగంలో ఇటీవల 100కుపైగా అంచనాలు పంపితే నిధులు మంజూరయ్యాయి. జంగారెడ్డిగూడెంలో ఆజాడే లేదు. ఫీడర్ పరిధిలో ఎక్కడ కరెంటు పోయినా అంతా తీసేస్తున్నారు. ప్రజలకు ఇది తలనొప్పిగా మారింది. ఇటీవల విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు మార్చడానికి ఆరు గంటలకు పైగా సరఫరా నిలిపివేశారు.
* జంగారెడ్డిగూడెం పట్టణంలో 25,501 విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. 12 వేలు దాటితే మరో విభాగం ఏర్పాటు చేయాలి. ఇంత వరకు రెండోది మంజూరు కాలేదు. పైగా ఉండాల్సిన అధికారి (ఏఈ) పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సబ్ ఇంజినీరు సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఎల్ఐ సురేష్ను పశ్చిమగోదావరికి డిప్యుటేషన్పై పంపారు. ప్రస్తుతం ఒకరే మిగిలారు. జేఎల్ఎం పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి.
చేతులెత్తేస్తూ... అతి పెద్ద విద్యుత్తు విభాగం కావడంతో నిత్యం ఏదో ఒక మూలన సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని సకాలంలో పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది.ఎక్కడికక్కడ తీగలు వేలాడుతున్నాయి. కరెంట్ పెట్టెలు కాలిపోతున్నాయి. తీగలకు చెట్లు, పాదులు చుట్టుకొని కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు లేవు. పనుల అంచనాలు వేయడంలోనూ వెనుకబాటు కొనసాగుతోంది. ‘విద్యుత్తు ఏఈతో పాటు ఇతర పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. కొత్త విభాగం మంజూరుకు ప్రతిపాదించాం’ అని ఈఈ అంబేడ్కర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!