కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్మోర్చా పిలుపుమేరకు అఖిల రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
ఏలూరులో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ
రైతు సంఘాల నాయకులు, కర్షకుల ప్రదర్శన
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్మోర్చా పిలుపుమేరకు అఖిల రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండు మీదుగా జూట్ మిల్లు, అగ్నిమాపక కూడలికి చేరుకుంది. ర్యాలీ కలెక్టరేట్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రైతు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, అన్నదాతల సమస్యలు పరిష్కరించాలి, రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ, రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథరావు, ఏపీ రైతు సంఘం నాయకుడు డేగా ప్రభాకర్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
ఎడ్లబండ్లపై వస్తున్న రైతులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు