ఖాళీ స్థలాలపై సర్వే
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాల్లో నివాసిత ప్రాంతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు.
శుభ్రం చేయకపోతే జరిమానా
భీమవరంలోని బ్యాంకు కాలనీలో నివాసిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాల్లో నివాసిత ప్రాంతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు.కొందరు కొన్నేళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలాలకు ఇప్పటికీ పన్ను చెల్లించకుండా, కనీసం శుభ్రం చేయించకుండా వదిలేశారు. ఇలాంటి స్థలాలు పందులు, విష సర్పాలకు నిలయాలుగా మారాయి. దోమల ఉత్పత్తి కేంద్రాలయ్యాయి. ప్రస్తుతం రీ సర్వే ప్రక్రియ చేపట్టారు. స్థలం ఎవరిదో, పన్ను చెల్లిస్తున్నారో లేదోననే విషయాలపై సర్వే చేపట్టారు. ఆ స్థలాలను శుభ్రం చేయించకపోతే జరిమానా విధించనున్నారు. సచివాలయాల వారీగా ఖాళీ స్థలాల గుర్తింపు చేపట్టామని పురపాలక రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుడు ఎన్.వి.వి. సత్యనారాయణ చెప్పారు. సచివాలయాల పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులందరి వివరాలు సేకరిస్తున్నామన్నారు. వాటిని శుభ్రం చేయించాలని సంబంధిత యజమానులకు చెప్పామన్నారు. స్థల వివరాలను యజమానులు నేరుగా సచివాలయాలకు తెలియజేయాలని సూచించారు.
విలువ ఆధారంగా
పట్టణాల పరిసరాల్లో కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. వాటిల్లో స్థలం కొనుగోలుచేసిన వారు కొన్నేళ్ల తర్వాత ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి వారిపై స్థలం ఆధారితంగా పన్ను భారం పడుతుంది. ఆ ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పన్ను విధిస్తారు. అదీ మూడేళ్ల వెనుక నుంచి అంటే ఆరు అర్ధ సంవత్సరాల పన్నును నిబంధనల మేరకు చెల్లించాలి. రీ సర్వే సమయంలో ఇలాంటి స్థలాల దస్తావేజులు, ఇతరత్రా వివరాలు, పన్ను చెల్లించిన రశీదులు చూపించకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఖాళీ స్థలానికి పన్ను చెల్లిస్తేనే ఆ స్థలంలో ఏదైనా నిర్మాణానికి అనుమతులు ఉంటాయి.
* భీమవరంలోని బ్యాంకు కాలనీ ఏర్పడి 30 ఏళ్లు దాటింది. అధునాతన భవనాలతో ఉన్న ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు చిట్టడవుల్లా ఉన్నాయి. వర్షపు నీరు నిలిచి మురుగు, చెత్త, ముళ్ల పొదలతో నిండిపోయాయి. మారుతీనగర్, నర్సయ్య అగ్రహారం, వంశీ కృష్ణానగర్, హౌసింగ్బోర్డు కాలనీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ తదితర చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి.
* ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం తదితర పట్టణాల్లో గతంలో కొందరు యజమానులను గుర్తించి తాఖీదులు ఇచ్చారు. శుభ్రం చేయించాలని బ్యానర్లను ఏర్పాటు చేశారు. అలాంటి స్థలాలకు పన్ను విధిస్తున్నారో లేదో ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.
కొన్నాళ్ల కిందట సర్వే చేయగా పట్టణాల్లో 14వేలకు పైగా ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ (సెషన్-2) ఫలితాలు వచ్చేశాయ్..
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM