సమన్వయంతో ప్రగతి పథం
పచ్చని పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి-సంక్షేమ రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
ఘనంగా గణతంత్ర వేడుకలు
పావురాలను ఎగురవేస్తున్న కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్, జేసీ మురళి తదితరులు
భీమవరం అర్బన్, న్యూస్టుడే: పచ్చని పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి-సంక్షేమ రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. భీమవరంలోని కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన జిల్లాగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాకు తాను మొదటి కలెక్టర్ కావడం గుర్తుండిపోతుందన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా సత్వరం లబ్ధిదారులకు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి పథకం ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కవాతు చేస్తున్న ఎన్సీసీ క్యాడెట్లు
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జిల్లా అభివృద్ధికి సంబంధించి చురుగ్గా చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విలువైన సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో 2.20 లక్షల మందికి రూ.110 కోట్లను రైతు భరోసాగా అందజేస్తున్నామన్నారు. రుణాలుగా రూ.6,183 కోట్లు అందిస్తున్నామన్నారు. 53,730 మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులు అందించి రుణాలు అందించామన్నారు. ఉచిత పంట బీమా పథకం కింద 50,314 మందికి రూ.100 కోట్లు పరిహారం అందించినట్లు వెల్లడించారు. ఖరీఫ్లో 63,586 మంది రైతుల నుంచి 3.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా నరసాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు. 19 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంలో ఆక్వా సాగు మరింత విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు.
సంక్షేమానికి పెద్దపీట..
అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నామన్నారు. 2,22,974 మందికి ప్రతి నెలా రూ.61కోట్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 601 లేఅవుట్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 72,636 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.
* మొదట ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై ఎస్పీ రవిప్రకాశ్తో కలిసి తిరిగి తర్వాత వేదికపై నుంచి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పావురాలను, బెలూన్లను ఎగురవేశారు
* సంయుక్త కలెక్టర్ జేవీ మురళి, ఆర్డీవో దాసి రాజుతో కలిసి అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.
* ఎస్పీ రవి ప్రకాశ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం శాంతి భద్రతల కోసం బాగా కృషి చేస్తోందంటూ అభినందించారు.కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు, ఎంఎస్ఎంఈ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సబ్కలెక్టర్ సూర్యతేజ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
* భీమవరంలోని కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్