logo

రాట్నాలమ్మ సేవలో పీవీ సింధు

పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. 

Published : 27 Jan 2023 03:47 IST

రాట్నాలకుంట (పెదవేగి), న్యూస్‌టుడే: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం ప్రత్యేక పూజలు చేశారు.   తండ్రి వెంకటరమణతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వయంగా తయారు చేసిన పొంగలిని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చల్లగోళ్ల వెంకటేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని