వండి వడ్డించడంలో యువ హవా!
భీమవరానికి చెందిన రమేష్కు ఆదివారం బిర్యానీ తినాలనిపించింది. గతంలో అయితే ప్రత్యేకంగా సిద్ధమై ద్విచక్ర వాహనంపై పట్టణం మధ్యకు వెళ్తేగాని కుదిరేదికాదు.
విస్తరిస్తున్న ఆహార వాణిజ్యం
క్యాటరింగ్లో యువకులు
* భీమవరానికి చెందిన రమేష్కు ఆదివారం బిర్యానీ తినాలనిపించింది. గతంలో అయితే ప్రత్యేకంగా సిద్ధమై ద్విచక్ర వాహనంపై పట్టణం మధ్యకు వెళ్తేగాని కుదిరేదికాదు. ఇప్పుడు ఇంట్లో నుంచి సైగ చేస్తే చాలు వీధి చివరనున్న బిర్యానీ దుకాణం సిబ్బంది వేడివేడిగా తెచ్చి అందిస్తున్నారు. పెరుగుతున్న అభిరుచులు దాన్ని దొరకబుచ్చుకుంటున్న యువత ఉమ్మడి జిల్లాలోని ఆహార వాణిజ్యాన్ని విస్తరింప జేస్తున్నారు. చేతినిండా ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
* పాలకొల్లుకు చెందిన యువకుడు చోడవరపు దుర్గారావు క్యాటరింగ్ వృత్తిలో స్థిరపడ్డారు. ఆయన దగ్గర నిత్యం 50 మంది ఉపాధి పొందుతున్నారు. కొవిడ్ తర్వాత క్యాటరింగ్ వృత్తికి బాగా డిమాండ్ పెరిగిందని అన్సీజన్లో కూడా నెలకు 15రోజులపైబడే తమకు పని లభిస్తోందని దుర్గారావు చెప్పారు.
పాలకొల్లు, న్యూస్టుడే: కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన భీమవరంలో ప్రస్తుతం 500 వరకు బిర్యానీ పాయింట్లు ఉన్నాయంటే నమ్మక తప్పదు. వీటిలో 70 శాతం యువత ఆధ్వర్యంలో నడుస్తున్నవే. ఏలూరు నగరంలో లాక్డౌన్కు ముందు 70 వరకు కర్రీ పాయింట్లు ఉండేవి. ప్రస్తుతం 150కి పైబడి ఉన్నాయి. వీటిలో చాలా వరకు మహిళలే నడుపుతున్నా అధిక సంఖ్యలో యువతులున్నారు. నగరంలోని పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రెండేళ్ల కిందట 10 నుంచి 12 రెస్టారెంట్లు ఉండగా ప్రస్తుతం 30 దాటాయి. ఉదయం, సాయంత్రం అల్పాహారం విక్రయించే మొబైల్ సెంటర్లకు లెక్కే లేదంటే వంటశాలలు, హోటళ్ల వ్యాపారంలో యువ హవా అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ తర్వాత నూతన సంవత్సరం, సంక్రాంతి నేపథ్యంలో కొత్త రెస్టారెంట్ల వ్యాపారం మూడు పార్శిళ్లు ఆరు ఆర్డర్ల చందాన కొనసాగుతోంది. మిఠాయిల తయారీలోనూ పలువురు యువత ఇంట్లో మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆహారమేకాదు ఆర్డరిస్తే ఫలహారాలు, అల్పాహారాలను కూడా అరటాకు నుంచి నీళ్ల సీసా వరకు అన్నీ సరఫరా చేస్తున్నారు.
పెరిగిన ఉపాధి..
ఆహార దుకాణాల విషయంలో కొవిడ్ - 19కు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవాలి. యలమంచిలి మండలం దొడ్డిపట్ల నుంచి పాలకొల్లు వరకు 15 కి.మీ. దూరంలో ప్రధాన రహదారి పొడవునా రెండు మూడు హోటళ్లు 2019 వరకు ఉన్నాయి. ప్రస్తుతం పరిశీలిస్తే సుమారు 10కి పైగానే వెలిశాయి. ఆన్లైన్ యాప్ల ద్వారా ఆహారాన్ని బుక్ చేసుకునే సౌలభ్యం ఉన్న భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వందల మంది యువత డెలివరీ ఉద్యోగాల్లో ఉపాధి పొందుతున్నారు. పాలకొల్లులో ఆన్లైన్ డెలివరీ అందుబాటులోకి రాకపోయినా ఆఫ్లైన్లో పనిచేస్తున్న డెలివరీ కుర్రాళ్లు ఉపాధి పొందుతున్నారు. వంటలు చేసే నలభీములకు గిరాకీ పెరిగింది. జిల్లాలోని ప్రతి పల్లె నుంచి పట్టణాల వరకు గతంతో పోలిస్తే ఆహార వ్యాపారం ఈ రెండేళ్లలో 50 శాతంపైగా పెరిగిందనేది అంచనా.
దృక్పథం మారింది...
వివిధ రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారు, గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చేసిన యువత వల్ల బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్లు పెరుగుతూ వచ్చాయని చించినాడకు చెందిన మల్లుల శ్రీనివాస్ చెప్పారు. రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ఇంట్లో తయారు చేసుకునే కన్నా కర్రీ పాయింట్లలో అవసరం మేరకు తెచ్చుకుంటే సరిపోతుందనే భావన ఇటీవల చాలా కుటుంబాల్లో రావడం.. యువత ఆహార వాణిజ్యంలోకి దిగడానికి కారణమైందని పాలకొల్లుకు చెందిన ఆరిమిల్లి వెంకటరమణ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా