logo

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి అతడి నుంచి రూ. 6.30 లక్షల విలువైన తొమ్మిది వాహనాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 29 Jan 2023 05:19 IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

తణుకు, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి అతడి నుంచి రూ. 6.30 లక్షల విలువైన తొమ్మిది వాహనాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సీఐ ముత్యాల సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన కర్రి సోమేశ్వరరావును స్థానిక సజ్జాపురం ఆర్వోబీ వంతెన వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. రాజోలు, తణుకు పట్టణ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు ఛేదించిన ఏఎస్సై పోలయ్యకాపు, కానిస్టేబుల్‌ సత్యనారాయణ, వెలగేశ్వరరావు, రవి, గోవిందరావులను డీఎస్పీ రవిమనోహరచారి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని