logo

నిందితులకు శిక్షలు పడేలా చూడండి: ఎస్పీ

నిందితులకు త్వరగా శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుళ్లు కృషిచేయాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలతో సమావేశం నిర్వహించారు.

Published : 29 Jan 2023 05:19 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: నిందితులకు త్వరగా శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుళ్లు కృషిచేయాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ కేసులు, నాన్‌ బెయిలబుల్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు సహాయపడాలన్నారు. జిల్లాలో కొత్తగా కోర్టు మానిటరింగ్‌సెల్‌ సీఐని నియమిస్తున్నామని, ఆయన పర్యవేక్షణలో ఆయా స్టేషన్ల పరిధిలో కేసుల సమీక్ష ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని