నాడున్న మరుగూ నేడు లేదాయె!
20 శాతంతో సరి... నాడు-నేడు పనులు ప్రారంభించడానికి మొదట విడుదల చేసిన 20 శాతం రివాల్వింగ్ ఫండ్ తర్వాత మళ్లీ రూపాయి విడుదల చేసింది లేదు.
వేలాది బస్తాల సిమెంట్ వృథా
పాఠశాలల్లో 2వ విడత పనుల పరిస్థితి
గంగడపాలెంలో అసంపూర్తిగా మరుగుదొడ్డి నిర్మాణం
20 శాతంతో సరి... నాడు-నేడు పనులు ప్రారంభించడానికి మొదట విడుదల చేసిన 20 శాతం రివాల్వింగ్ ఫండ్ తర్వాత మళ్లీ రూపాయి విడుదల చేసింది లేదు. 2021 ఆగస్టులో మొదలైన రెండో విడత పనులు 2023 వేసవి సెలవులు సమీపిస్తున్నా పునాది దశ దాటకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 726 పాఠశాలల్లో 39 జూనియర్ కళాశాలల్లోను ఈ పనులు ప్రతిపాదిత నిధులతో ప్రారంభమయ్యాయి. ఉన్న నిధులన్నీ ఆరంభ పనులకే వెచ్చించడం తర్వాత కనీసం కూలీ ఖర్చులు కూడా విడుదల చేయక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
అధికారుల అత్యుత్సాహం
రివాల్వింగ్ ఫండ్ 20 శాతం పాఠశాల ఖాతాలకు జమైనప్పుడు కొంత నిల్వచేసి అత్యవసరమైన మరుగుదొడ్లు వంటి పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఎక్కడా అలాచేయలేదు. ఉన్న మొత్తం వెచ్చించి ఇనుము, ఇటుకలు, ఇసుక, ఇతరాత్ర మెటీరియల్ను అధికారులు అన్నిచోట్లా దించేశారు. దీనివల్ల ఇనుము తుప్పు పడుతుండగా ఇసుక వర్షాలకు చాలావరకు కొట్టుకుపోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పనులు ప్రారంభించకుండానే ఎందుకిలా అంటే ఆయా డీలర్ల నుంచి వచ్చే కమీషన్ కొరకు కక్కుర్తేనని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లాలో నాడు-నేడు పనుల పర్యవేక్షణాధికారి మధును ‘న్యూస్టుడే’ సంప్రదించగా విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ప్రకాష్ ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా పలు పాఠశాలల్లో పరిస్థితిని పరిశీలించారని చెప్పారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని వెల్లడించారు.
గడ్డ కట్టిన సిమెంట్
ముందు చూపులేక చేసే పనులతో నష్టం తప్పదని రెండో విడత పనులు నిరూపిస్తున్నాయి. ఎంపికైన ప్రతి పాఠశాలకు 150 నుంచి 200 సిమెంట్ బస్తాలు దిగుమతి చేశారు. ఇవన్నీ ప్రస్తుతం సిమెంట్ గడ్డకట్టేసి పనికిరాని స్థితికి చేరాయి. వాస్తవానికి ఒక సిమెంట్ బస్తా కొనుగోలు చేశాక కనీసం 90 రోజుల్లో వినియోగించాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాది దాటిపోవడంతో ఒక్కో మండలానికి సరాసరిన 5 వేల బస్తాలకు పైబడి సిమెంట్ వృథాగా మారిందని అంచనా. దీనిని విలువ కడితే ప్రతి మండలంలోనూ రూ.15 లక్షల ప్రజాధనం నిరుపయోగంగా మారినట్టేనని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్