మొవ్వు కుళ్లు.. రైతుల్లో గుబులు!
మెట్ట ప్రాంత వరి చేలకు మొవ్వుకుళ్లు తెగులు సోకడంతో దుబ్బులు ఎండిపోయి మొక్కలు నిలువునా చనిపోతున్నాయి.
నిలువునా ఎండుతున్న రబీ వరి చేలు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: మెట్ట ప్రాంత వరి చేలకు మొవ్వుకుళ్లు తెగులు సోకడంతో దుబ్బులు ఎండిపోయి మొక్కలు నిలువునా చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు రకరకాల పురుగు మందులు, గుళికలు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. నాట్లు వేసి నెల దాటినా మొక్కల్లో కనీస ఎదుగుదల లేకపోవడంతో నారు అందుబాటులో ఉన్న వారు చేలను దున్నేసి తిరిగి కొత్తగా నాట్లు వేస్తున్నారు.
లక్కవరం, గురవాయిగూడెం, చక్రదేవరపల్లి, నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఎంటీయూ 1121 రకం వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ వందల ఎకరాల్లో తెగులు సమస్య తీవ్రంగా ఉంది. అసలు పంట పండుతుందా లేదా అన్న భయం కర్షకులను వెంటాడుతోంది. ఇక కౌలుదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు.
ఎకరం చేను దున్నేశా..
‘గురవాయిగూడెంలో నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. మొవ్వు తెగులు సోకి ఎక్కడికక్కడ మొక్కలు కుళ్లిపోతున్నాయి. రెండు సార్లు గుళికలు వేశా. మూడు పర్యాయాలు పురుగు మందులు పిచికారీ చేశా. అయినా ఫలితం లేదు. ఎకరం చేను దున్నేసి మళ్లీ నాట్లు వేశా. ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి అయ్యింది’ అని లక్కవరానికి చెందిన రైతు దల్లి అంజేశ్వరరావు తెలిపారు.
గురవాయిగూడెంలో కుళ్లు తెగులుతో దున్నేసి మళ్లీ వరినాట్లు వేసిన పొలం
బతికించుకోవడానికి తీవ్ర ప్రయత్నం
‘ఆరెకరాల్లో వరి వేశా. తెగులు తీవ్రంగా ఉంది. గుళికలు ఎకరానికి నాలుగు కేజీల చొప్పున వేశా. పురుగు మందులు మూడు సార్లు పిచికారీ చేశా. అయినా పంట దక్కుతుందో లేదో అన్న భయం ఉంది. బతికించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా’ అని గురవాయిగూడేనికి చెందిన కోనే సుధాకరరావు వాపోయారు.
ఇలా చేయండి
‘లక్కవరంలో సుమారు 200 ఎకరాల్లో మొవ్వుకుళ్లు తెగులు సోకింది. తెగుళ్ల కారణంగా దున్నేసి మళ్లీ నాట్లు వేసిన విషయం నా దృష్టికి రాలేదు. ప్లాంటో మైసిన్ ఒక గ్రాము, కొసైడ్ రెండు గ్రాముల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి’అని వ్యవసాయ శాఖ కేఆర్పురం ఏడీ బుజ్జిబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?