వృక్ష విలాపం!
చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, ఆర్అండ్బీ విభాగాల వారు నిర్వహణ పేరుతో తరచూ అడ్డుగా ఉన్న కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు.
నిర్వహణ పేరుతో చెట్లు నరికివేత
పట్టించుకోని యంత్రాంగం
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే-జంగారెడ్డిగూడెం
నరికిన చెట్లను ట్రాక్టర్పైకి ఎక్కిస్తున్న కూలీలు
విద్యుత్తు తీగలకు అడ్డు వస్తున్నాయి.. రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న సాకుతో అక్రమంగా చెట్లను నరికేస్తున్నారు. రహదారి నిర్వహణ పేరుతో కొమ్మలు నరకాల్సింది పోయి చెట్లు నరికి దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, ఆర్అండ్బీ విభాగాల వారు నిర్వహణ పేరుతో తరచూ అడ్డుగా ఉన్న కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు. ఎక్కడైనా విద్యుత్తు తీగలకు అడ్డు వచ్చిన చోట్ల ఒకటీ అర నరకటం పరిపాటి. ఈ వంకతో ఇష్టారాజ్యంగా కొమ్మలతోపాటు చెట్లను కూడా నరికేస్తున్నారు. సోమవారం ఏలూరులో పార్కు వద్ద ఇలానే చెట్లను నరికేశారు. గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లు, లారీల్లో సర్దుకుని ఇటుకల బట్టీలు, పొగాకు బేరన్లు, శ్మశానవాటికలకు తరలించేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా దెందులూరు, పెదవేగి. ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారి, ముసునూరు నూజివీడు రహదారి, టి.నరసాపురం, కామవరపుకోట, చింతలపూడి మండలాల్లో యథేచ్ఛగా సాగుతోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా మామూళ్ల మత్తులో మిన్నకుంటున్నారు.
నిబంధనలు బేఖాతరు
చెట్లు నరికేందుకు పంచాయతీలో తీర్మానం చేయాలి. అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అనుమతులు తీసుకున్నాక చెట్లు నరకాలి. వాటిని బహిరంగ వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయాలి. ఈ నిబంధనలు కాగితాల్లో తప్ప కార్యరూపం దాల్చటం లేదు. బహిరంగంగా చెట్లు నరికేసినా పంచాయతీ, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చనిపోయిన చెట్లు నరికేందుకు అనుమతులు తీసుకుని బతికున్న చెట్ల ఉసురుతీస్తున్నారు. చెట్లు నరికేందుకు పెదవేగి, దెందులూరు మండలాల్లో ప్రత్యేక బృందాలున్నాయి. జిల్లాలో ఎక్కడ చెట్లు నరకాలన్నా వీరికి చెబితే చాలు రాత్రికి రాత్రి నరికి తరలించేస్తారు. ఈ విషయంపై జేసీ అరుణ్బాబు వివరణ కోరగా అనుమతులు లేకుండా చెట్లు నరకటం నిబంధనలకు విరుద్ధమని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిలోని బొర్రంపాలెం అడ్డరోడ్డులో నరికేసిన చెట్టు. దీనికి వందేళ్ల వయస్సు ఉంటుందని అంచనా కొన్ని రోజుల క్రితం దీన్ని నరికి మూడో కంటికి తెలియకుండా తరలించేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని తొలగించామని అధికారులు చెబుతున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో చెట్లు నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. జంగారెడ్డిగూడెం - బుట్టాయగూడెం రోడ్డు వెంబడి ఇటీవల పెద్ద ఎత్తున చెట్లు నరికేశారు. పట్టణంలోని మార్కండేయపురం పరిధిలోని మంచినీటి ట్యాంకుకు 24 గంటల విద్యుత్తు లైన్ నిర్మాణం కోసం చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యుత్తు లైన్ కోసం నిబంధనల ప్రకారం కొమ్మలు నరకాలి. ఇక్కడ మాత్రం చెట్లు నరికేసి భారీ ఎత్తున కలప పోగేశారు.
* ఆర్అండ్బీ నూజివీడు సెక్షన్ పరిధిలో చనిపోయిన చెట్లు నరికేందుకు రూ.7080 చెల్లించగా రసీదు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే చనిపోయిన చెట్లు నరికేందుకు అనుమతి తీసుకుని బతికున్న చెట్లను నరుక్కుని ట్రాక్టర్ల ద్వారా ఇటుకల బట్టీలకు తరలించేస్తున్నారు. రసీదులో ఎన్ని రోజుల్లో నరకాలి, ఎన్ని చెట్లు నరకాలి..అన్న వివరాలు లేవు. దీంతో నామమాత్రపు రుసుము చెల్లించి టన్నుల కొద్దీ చెట్లు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారం నూజివీడు పరిధిలోని లీలానగర్ ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా జోరుగా సాగుతోంది.
* రెండు నెలల క్రితం దెందులూరు మండలం కొవ్వలిలో మంచినీటి చెరువు చుట్టూ ఉన్న సుమారు 32 చెట్ల అనుమతులు, తీర్మానాలు లేకుండా రాత్రికి రాత్రే నరికి తరలించారు.. దీనిపై పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు విచారణ కూడా చేయకుండా తెరమరుగు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’