పురాల్లో ఆక్రమణల పర్వం!
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నరసాపురంలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన వ్యవహారంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో సంబంధిత కౌన్సిలర్ అధికారులను నిలదీశారు.
సామాజిక స్థలాలకు కొరవడిన రక్షణ
భీమవరం పట్టణం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నరసాపురంలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన వ్యవహారంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో సంబంధిత కౌన్సిలర్ అధికారులను నిలదీశారు. ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లోనూ ఈ తరహా కబ్జా వ్యవహారాలు గతంలో వెలుగుచూశాయి. పురపాలక సంఘాలకు చెందిన రిజర్వు స్థలాలకు చాలా చోట్ల ఏళ్ల తరబడి ఎలాంటి రక్షణ లేకపోవడంతో అక్రమార్కులు వాటిపై కన్నేసి ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి స్థలాలకు ప్రైవేటు వ్యక్తుల పేరిట పన్ను వేయించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆకివీడు పట్టణ నడిబొడ్డున ఉన్న దొరగారి చెరువు ఇది. ఏళ్ల తరబడి నిరుపయోగంగా వదిలేయడంతో దీని చుట్టూ ఆక్రమణలు పెరిగిపోయాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ఉండాల్సి చెరువు భూమిలో సుమారు రెండెకరాల వరకు అన్యాక్రాంతమైంది. దీని విలువ ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ప్రకారం రూ.20 కోట్ల పైమాటే. కొందరు రాజకీయ నాయకులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తూ చెరువు ప్రక్షాళన అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే పట్టణంలో కొండయ్యచెరువు భూములు కూడా ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రూ.కోట్ల విలువైన పురపాలక స్థలానికి ప్రైవేటు వ్యక్తుల పేరిట పన్ను వేయండంటూ ఓ నాయకుడు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ఉద్యోగులకు ఆ నేత నుంచి పిలుపు రావడం వెనుక ఎవరి హస్తం ఉందనే విషయమై చర్చ జరుగుతోంది. ఈ పట్టణంలో తృతీయశ్రేణి నాయకుడొకరు పురపాలక స్థలాన్ని శుభ్రం చేయించి పాగా వేసేందుకు ప్రయత్నించగా స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీనిని కేటాయించిన స్థలం ఆక్రమణల చెరలో ఉండటంతో పనులు మొదలు కాలేదు. ఈ వ్యవహారం వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
పాలకొల్లు పురపాలక సంఘానికి చెందిన రూ.కోట్ల విలువైన రిజర్వు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. దీనికోసం కొద్ది రోజుల పాటు పట్టణంలో మకాం వేశారు. విషయం బయటకు పొక్కి ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.
ఇదీ తీరు..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాల్లో స్థలాలకు సంబంధించి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్(ఎఫ్ఎంబీ)ను 1935లో తయారు చేసి సరిహద్దులను నిర్ణయించారు. ఆక్రమణదారులు అప్పటి కొలతలను తారుమారుచేసే యత్నాలు ప్రారంభించారు. కొన్ని పట్టణాల్లో గతంలో ఆక్రమణలకు గురైన కొన్ని స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి జాగాలకు కూడా రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు మళ్లీ కబ్జాలకు తెగబడుతున్నారు. భీమవరంలో అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్న స్థలానికి ఇప్పటికీ రక్షణ చర్యలు తీసుకోలేదు. నరసాపురంలో పురపాలక స్థలాలకు రక్షణ చర్యలు చేపట్టాలనే ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.
చర్యలు చేపట్టాం
పురపాలక రిజర్వు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టామని పట్టణ ప్రణాళిక ఆర్డీ ఎన్.శ్రీనివాస్ చెప్పారు. రిజర్వు స్థలాల విషయంలో జీవో ఆర్టీ 114 ప్రకారం చర్యలుంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!