ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. అతడి మూడేళ్ల చిన్నారికి స్వల్ప గాయాలైన సంఘటన జంగారెడ్డిగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది.
తండ్రి దుర్మరణం.. కుమార్తెకు స్వల్పగాయాలు
అనిల్కుమార్ (పాతచిత్రం)
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. అతడి మూడేళ్ల చిన్నారికి స్వల్ప గాయాలైన సంఘటన జంగారెడ్డిగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జంగారెడ్డిగూడెం మండలం చిన్నంవారిగూడేనికి చెందిన బండారు అనిల్కుమార్(28) జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన మూడేళ్ల కుమార్తె విషితను వారం రోజుల కిందట అదే పాఠశాలలో నర్సరీలో చేర్చాడు. ఈ నేపథ్యంలో గురువారం విధులు ముగిసిన అనంతరం కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా జల్లేరు వంతెన వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టడంతో చెరోవైపు పడిపోయారు. ఆ సమయంలో అనిల్కుమార్ తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఘటనాస్థలిలోనే చనిపోయాడు. చిన్నారి విషిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంతో వంతెనకు ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచింది. సీఐ బాలసురేష్, ఎస్సై సాగర్బాబు చేరుకొని ట్రాఫిక్ను క్రమబధ్ధీకరించారు. అనిల్కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో తండ్రిని కోల్పోయి అయోమయ స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన పలువురు కంటతడిపెట్టారు. వెంటనే స్థానికులు ఆమెను వేరే వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కుటుంబానికి ఆసరాగా ఉండే వ్యక్తి చనిపోవడంతో అతడి భార్య, తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
రైల్లోంచి పడి.. యువకుడి మృతి
రెజిమెంటల్ బజార్, న్యూస్టుడే: ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా గునుపూడికి చెందిన ధూళిపూడి తేజ (31) కూకట్పల్లిలో ఉంటూ పండ్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. సొంతూరులో ఉంటున్న తండ్రికి ఆరోగ్యం బాలేదని తెలిసి అక్కడికి వెళ్లేందుకు బుధవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైల్లో బయల్దేరాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఘట్కేసర్- బీబీనగర్ స్టేషన్ల పక్కన ఓ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన కీమ్యాన్ జీఆర్పీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి వద్ద లభ్యమైన ఆధార్కార్డు ఆధారంగా తేజగా గుర్తించారు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో డోర్ వద్ద కూర్చుని ఉండటంతో ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గడ్డి మందు తాగి ఒకరి బలవన్మరణం
పెదపుల్లేరు(ఉండి), న్యూస్టుడే: కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఒక వ్యక్తి మనస్తాపం చెంది గురువారం గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై కె.గంగాధరరావు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. పెదపుల్లేరు గ్రామానికి చెందిన దొంగ శ్రీను(52) వైద్యానికి ఖర్చు ఎక్కువవుతోందని గురువారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. హుటాహుటిన శ్రీనుని భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సునిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్సై గంగాధరరావు తెలిపారు.
బావ మృతిని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య
పెదపాడు, న్యూస్టుడే: బావ ప్రమాదంలో మృతి చెందిన ఘటనను జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పెదపాడు ఎసై బి.నాగబాబు తెలిపిన వివరాల మేరకు..కొత్తముప్పర్రు గ్రామానికి చెందిన చేసాని జగన్నాథరావు, కుటుంబ సభ్యులందరూ స్థానిక ఇటుకల బట్టిలో పనిచేస్తుంటారు. ఆయన కుమార్తె (14) కూడా అక్కడే పనిచేస్తోంది. గత నెల 25న బాలిక బావ నాగరాజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదలో మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదే రోజు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి